(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఈ ఏడాది పదవ తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలు కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదపు 5 లక్షల 20 వేల మంది పరీక్షలకు హాజరు కానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అందులో మూడో వంతు విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరు కావల్సి ఉంది. విద్యాశాఖాధికారులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి…..
హైదరాబాద్: 362 కేంద్రాల్లో 78,465 మంది విద్యార్థులు.
రంగారెడ్డి: 255 కేంద్రాల్లో 53,050 మంది విద్యార్థులు.
మేడ్చల్: 237 కేంద్రాల్లో 49,999 మంది విద్యార్థులు.
పరీక్షలు -నిబంధనలు- సూచనలు…..
పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగుతాయి. అయితే, భౌతికశాస్త్రం (Physics), జీవశాస్త్రం (Biology) పరీక్షలకు మాత్రం ఉదయం 9:30 నుండి 11:00 గంటల వరకు మాత్రమే సమయం ఉంటుంది.విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తి లేదని అధికారులు స్పష్టం చేశారు.

నిషేధిత వస్తువులు…..
పరీక్షా హాల్లోకి సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, క్యాలిక్యులేటర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావడంపై పూర్తి నిషేధం ఉంది.
హాల్ టికెట్లు……
హాల్ టికెట్లు లేనిదే పరీక్షకు అనుమతించరు. విద్యార్థులు 80989 58096 నంబర్కు వాట్సాప్ చేయడం ద్వారా కూడా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు……
ప్రతి కేంద్రంలో తాగునీటి సౌకర్యం, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణ చికిత్స అందించడానికి ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు, తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల నిఘా ఉంటుంది మరియు 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
పరీక్షల మధ్య తగినంత విరామం 4 రోజుల ఉంది కాబట్టి, విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా ఉత్సాహంగా పరీక్షలు రాయాలని విద్యాశాఖాధికారులు సూచిస్తున్నారు. నగరంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్యపై పోలీసులు దృష్టి సారించాలని విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు.







Leave a Reply