(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఇరాన్ యుద్ధ నేపథ్యంలో స్థానికులకు హెచ్చరికలు చేసిన సంభాల్ డిఎస్పీ ప్రదీప్ సింగ్ పై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పోలీసు అధికారికగా ముస్లింలను కించపరిచే విధంగా ఎలా మాట్లాడుతారని నిలదీశారు. భారత రాజ్యంగం ప్రకారం పోలీసు అధికారికి ఇలాంటి అధికారాలు లేవన్నారు. సంభాల్ ఆ డిఎస్పీ అబ్బదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంభాల్ లో పరిస్థితుల నేపథ్యంలో డిఎస్పీ శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా చివరి శుక్రవారం రోజు అంటూ ఇరాన్ కు మద్దతుగా ర్యాలీలు నిర్వహించినా…నినాదాలు చేసినా….తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇరాన్కు మద్దతు ఇవ్వదలుచుకుంటే ఇరాన్ వెళ్లి యుద్దంలో పాల్గొని రావచ్చని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సీరియస్ అయ్యారు. ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ఎంఐఎం తన అధికారిక ఎక్స్ లో పోస్టు చేసింది. డిఎస్పీ నెతన్యూహు లా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.ఫ్రీడం ఆఫ్ ఎక్పెప్రెషన్ ఆర్టికల్ 9 ప్రకారం మాట్లాడే అవకాశం ఉందన్నారు. ఇరాన్ తో యుద్ధం కంటే ముందు మోడీ నెతన్యూహు ను ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ పార్లమెంట్ లో ఎప్పుడూ ఎవరికీ ఇవ్వని అవార్డును ఈ సందర్బంగా మోడీకి ఆదేశం ఇచ్చి సంతోష పరిచిందని అసద్ వ్యాఖ్యలు చేశారు.
సమాజ్ వాది పార్టీ ఎంపీ జియా ఉర్ రహ్మెన్ కూడా డిఎస్పీ ఇలాంటి హెచ్చరికలు చేయడం సమంజసం కాదన్నారు. ఆ అధికారికి ఇలాంటి అధికారాలు ఎవరు ఇచ్చారని నిలదీశారు. ఒక వర్గాన్ని కించపరిచే లా డిఎస్పీ వ్యాఖ్యలు చేయడం సమర్ధనీయం కాదన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సంభాల్ డిఎస్పీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సంభాల్ డిఎస్పీ పై ఒవైసీ ఏమన్నారో చూడండి….










Leave a Reply