
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 16 వ తేదీ నుంచి వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 16వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వడగళ్ల వానాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని అప్రమత్తం చేసింది. తెలంగాణాలో ఈ ప్రభావం 18,19 తేదీల్లో ఎక్కువగా ఉండే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.ఈ ప్రభావంతో రైతులు పంటలను నష్ట పోయే ప్రమాదం ఉందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొంది. అయితే గత రెండు రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఊష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదౌతున్నాయి. భారీ వర్షాలకు ముందు ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వేసవి తాపం మొదలైందని అంటున్నారు.
మరాట్వాడ ప్రాంతం నుండి ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్నాటక వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ఈరోజు ద్రోణి ఏర్పడిందినిన్న జార్ఖండ్ ప్రాంతం నుండి విదర్భ ప్రాంతం వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు ఉత్తర ఉత్తర ప్రదేశ్ యొక్క మధ్య ప్రాంతం నుండి చత్తీస్ ఘడ్ మీదుగా దక్షిణ అంతర్గత ఒడిశా వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన…
రేపు రాష్ట్రంలోని కొన్ని ఉత్తర, పశ్చిమ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి రాష్ట్రంలోని ఉత్తర మరియు మధ్య జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. నాలుగు, ఐదు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి మూడు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది.
రేపు,ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు మరియు 30 నుండి 40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులు తో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.









Leave a Reply