(హైదరాబాద్,న్యూస్ఇన్)
పర్యావరణ సమతుల్యత దెబ్బతిని కాలూష్యం విషం చిమ్ముతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర ప్రజల మనుగడ ప్రశ్నార్దకంగా మారుతుంది. అభివృద్ది ఎంత వేగవంతంగా జరుగుతున్నా నగర జీవన ప్రమాణాలు శాపగ్రస్తంగా మారాయి. వేగంగా జరుగుతున్న అభివృద్దిని చూసీ సంతోషించాలో, క్షీణిస్తున్న పర్యావరణ ప్రమాణాలను చూసి బాధపడాలో అర్ధం కాని సంకటస్థితిలో ఉంది నగర ప్రజానికం. విశ్వనగరాలుగా దూసుకెళ్తున్న అనేక పట్టణాల్లో భూగర్బ జల సంపద, పర్యావరణ సమతుల్యత లేక, అనేక సమస్యల్లో చిక్కుకుంటేన్నారు నగర పౌరులు. తలసరి ఆదాయం ఎంతఉన్నా అందులో సగభాగం వరకూ వివిధ వ్యాధులకు ఖర్చవ్వడం పట్ల నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నీళ్లతో పాటు గాలిని కూడా మాల్స్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. ఢిల్లీ, ముంబాయి, కోల్ కత, బెంగుళూరు వంటి మహానగరాల మనుగడ పర్యావరణ సంక్లిష్టతతో ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి ఉపద్రవాన్ని ముందుగానే పసిగట్టిన సీఎం రేవంత్ రెడ్డి నగర భవిత కోసం సాహపోపేత నిర్ణయం తీసుకున్నారు.

ఏ సీఎం తీసుకోని వినూత్న కార్యక్రమం….
ఉమ్మడి రాష్ట్రాల ముఖ్మమంత్రులతో పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ కూడా తీసుకోని వినూత్న కార్యక్రమాన్ని తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యావరణ పరిరక్షణ కోసం అమలు చేస్తున్న విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. భవిష్యత్ తరాలకు స్వఛ్చమైన పర్యావరాణాన్ని అందించడమే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. నగరంలో ఇప్పటికే అడుగంటిన భూగర్బ జలాలను కాపాడే క్రమంలో హైడ్రా ద్వారా నగరంలోని చెరువులను, కుంటలను పరిరక్షించి సహజసిద్దంగా ఏర్పడిన జల వనరులను కాపాడే కార్యాచరణ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొదట్లో అనేక విమర్శలు ఎదురైనా నగరంలోని బతుకమ్మ కుంట, బుమృక్-దౌలా, నల్ల చెరువు అభివృద్దిని చూసిన తర్వాత నగర ప్రజల నుండి ఊహించని ప్రశంసలు అందాయి. పునరుద్దరించిన చెరువుల చూట్టూ పచ్చని వాతావరణం, గలగలమని ప్రవహిస్తున్న నీళ్లు, చెరువుల చుట్టు పక్షుల కిలకిలా రావాలతో ఆ ప్రదేశం అంతా ఆహ్లాదంగా మారింది.
మూసీ పునరుజ్జీవం….

మూసీ నది పునరుజ్జీవనాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వ్యర్ధాలతో మురికి కూపంగా మారిన మూసీ నదికి పునరుజ్జీవం కల్పిస్తే భువనగిరి నుండి నల్లగొండ జిల్లా వజీరాబాద్ వరకు దాదాపు 110 కిలో మీటర్ల మేరకు పచ్చని ఆహ్లాదకర వాతావరణంతో పాటు పర్యావరణ పరిరక్షణ, భూగర్బజల సంపదను కాపాడుకోగలమనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవం అనే బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
భావితరాలకు బంగారు బాటలు…..

మూసీ పరీవాహక ప్రాంతం వెలుపల ప్రభుత్వ భూముల్లో బాదితులకు ఇళ్ల సముదాయాలను నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఎక్కడికో వెళ్లి కొత్త ప్రాంతంలో జీవించాల్సిన అవసరం లేకుండా స్థానికంగా నే ఉపాధి అవకాశాలు కల్పించేలా సీఎం రేవంత్ కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా మూసీ నది పురుజ్జీవానికి కార్యచరణ తీసుకుని భావితరాలకు పచ్చని పర్యావరణాన్ని. కలుషితం లేని జల సంపదను అందించేందుకు బృహత్కర ప్రణాళిక రచించారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవం గురించి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అనేక వినూత్న అంశాలని ప్రజలకు వివరించారు.
రిపోర్ట్ …..కృష్టహరి







Leave a Reply