NewsInn

News in a Click

మూసీ భూముల ఆక్రమణకు సీఎం రేవంత్ పథకం

మూసీ భూముల ఆక్రమణకు సీఎం రేవంత్ పథకం
  • బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

మూసీ న‌ది భూములు అక్ర‌మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి పున‌రుజ్జీవ ప‌థ‌కం ప్రారంభించార‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిఎడంట్ కేటిఆర్ ఆరోపించారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి న‌ష్టం లేకుండా కూడా మూసీ న‌దిని సుంద‌రీక‌రించ‌వ‌చ్చ‌న్నారు. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హాయంలో కూడా ఆరు కిలోమీట‌ర్లు సుందరీకరించామ‌న్నారు. తాము మూసీ పున‌రుజ్జీవ ప‌థ‌కాన్ని త‌ప్పుబ‌ట్ట‌డం లేద‌ని పేద ప్ర‌జ‌ల ఇళ్ల‌ను కూల్చి వేత‌ను ,మూసీ ప్రాజెక్టు లో అవినీతిని అడ్డుకుంటామ‌న్నారు. ఈ ప్రాజెక్టులో 1.5 ల‌క్షల కోట్ల విలువ చేసే భూములు అక్ర‌మిస్తున్నార‌న్నారు. హిమాయత్ సాగర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ “ముసీ పునరుజ్జీవం – పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్” కార్యక్రమం నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ.16,000 కోట్లతో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీని అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఇప్పటికే ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో 6 కిలోమీటర్ల మేర విజయవంతంగా అభివృద్ధి చేశామని వివరించారు. అయితే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయల అంచనాలతో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ విద్వంసానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు. అభివృద్ధికి మేము ఏమాత్రం వ్యతిరేకం కాదని…అవినీతికి కాంగ్రెస్ పార్టీ భూదాహానికి రేవంత్ రెడ్డి లక్షల కోట్ల అవినీతి ప్రణాళికలకు మాత్రం వ్యతిరేకమని కేటీఆర్ అన్నారు.

రేవంత్ రెడ్డి అవినీతిని ఖ‌చ్చితంగా అడ్డుకుంటాము…పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నగర ప్రజలను కాపాడుకుంటాము…తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు పరంగా పెట్టి వందల ఉద్యమాలు చేసి సాధించుకున్న భూమి పుత్రులుగా కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఎదుర్కొంటామని కేటీఆర్ తెలిపారు.
ఇచ్చిన హామీలకు అభివృద్ధికి డబ్బులు లేవు, విపరీతంగా అప్పులు ఉన్నాయని చెబుతున్న రేవంత్ రెడ్డి మూసి కోసం వేల కోట్లు ఖర్చు పెడతా అంటున్నారు.

నమామి గంగే కి ఖర్చు 42 వేల కోట్లు. వందల కిలోమీటర్ల నమామి గంగే కి ఖర్చు కేవలం 42 వేల కోట్లు అయితే, 55 కిలోమీటర్ల మూసీకి లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చవుతుందనే మా ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. 20 ఏళ్ల కింద కట్టుకున్న అపార్ట్‌మెంట్‌లను, ఇళ్లను కూలగొడతా అంటున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు మూసీ బఫర్ జోన్‌లో కడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థల అపార్ట్‌మెంట్‌లను మాత్రం ముట్టుకోనని చెబుతున్నాడు. బఫర్ జోన్ లో ఉన్న వాటిని కులగోట్టి తిరిగి అవే బఫర్ జోన్లో భారీ భవనాలు కడతా అని సీఎం అంటున్నారు. మూసీ పున‌రుజ్జీవ ప‌థ‌కం కోసం రూ. 16,000 కోట్లతో 57 కిలోమీటర్ల మూసీని అభివృద్ధి చేయవచ్చ‌ని, కానీ స‌ర్కార్ మాత్రం మొద‌టి ఫేజ్ కే 5000 వేల కోట్ల రుపాయాలు అని చెబుతోంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *