NewsInn

News in a Click

మాజీ ఎమ్మెల్యే ఫాం హౌస్ లో కాల్పుల క‌ల‌క‌లం

మాజీ ఎమ్మెల్యే ఫాం హౌస్ లో కాల్పుల క‌ల‌క‌లం
  • ఏలూరు ఎంపీ మ‌హేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అరెస్టు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెల్ల‌వారితే ఆదివారం…. ఇక మజా చేసుకోవ‌చ్చని ప్ర‌ముఖులంతా ఒకే చోట చేరారు.అది మాజీ ఎమ్మెల్యే ఫాం హౌస్ కావ‌డంతో….పోలీసులు న‌జ‌ర్ అక్క‌డ ఉండ‌ద‌ని భావించారు. రాజ‌కీయ నేత‌ల‌తో పాటు హైదరాబాద్, ఢిల్లీకి చెందిన వ్యాపారులు ఈ వీకెండ్ కోసం అక్క‌డ‌కు చేరుకున్నారు. ఇలాంటి పార్టీల‌పై నిఘా వేసిన పోలీసుల‌కు స‌మాచారం రానే వ‌చ్చింది. ప్ర‌ముఖ‌లంతా క‌లిసారంటే ఖ‌చ్చితంగా వీకెండ్ లో డ్ర‌గ్స్ ఉంటాయ‌న్న అనుమానం పోలీసుల‌కు వ‌చ్చింది. ఇంకేముందు న‌గ‌ర శివారు ప్రాంతం అయిన మొయినాబాద్ లో ఉన్న ఆ ఫాం హౌస్ పై ఈగ‌ల్ బృందం అటాక్ చేసింది.

వారిని రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకోవాల‌ని ప్రణాళిక తో వెళ్లింది. డ్ర‌గ్స్ మ‌జాలో ఉన్న ఆ ప్ర‌ముఖులు పోలీసులను చూసి గాలిలోకి మూడు రౌండ్ల కాల్ప‌లు జ‌రిపారు. అయితే పోలీసులు త‌మ‌కు వ‌చ్చిన స‌మాచారం నిజ‌మ‌ని ఖ‌రారు చేసుకున్నారు. జ‌రిపినా….పోలీసులు వెనుక‌డుగు వేయ‌కుండా ఆ ఫాం హౌస్ కు చేరుకుని అక్క‌డున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవ‌ల చేస్తున్న ర్యాపిడ్ టెస్ట్ ను అక్క‌డున్న వారంద‌రికీ నిర్వ‌హించారు. 10 మందిలో ఐదు గురికి పాజిటివ్ గా ఈ టెస్ట్ లో వ‌చ్చింది. వారున్న చోట మ‌రో 2 గ్రాములు వైట్ పౌడ‌ర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.(డ్ర‌గ్ పౌడ‌ర్) దీని పేరు పోలీసులు ధృవీక‌రించాల్సి ఉంది.

నిషేధిత డ్ర‌గ్స్ తీసుకుంటుండ‌డం ఒక త‌ప్పైతే…..పోలీసుల‌ను చూసి కాల్పులు జ‌రిపిన అంశాన్ని పోలీసు ఉన్న‌తాధికారులు సీరియ‌స్ గా తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. లైస‌న్స్ డ్ వెప‌న్ తో గాలిలోకి కాల్పులు ఎందుకు జ‌రుపాల్సి వ‌చ్చింద‌న్న అంశంపై పూర్తి స్థాయి విచార‌ణ చేస్తామ‌ని చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ చెబుతూ ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డించారు.

డీసీపీ యోగేష్ గౌత‌మ్ వెల్ల‌డించిన వివ‌రాలు…

మొయినాబాద్ లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి చెందిన ఫాం హౌస్ లో డ్రగ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో రైడ్ చేశాము.

ఈగల్ టీమ్ ను చూసి ముందు న‌మీత్ శర్మ గాల్లోకి ఫైరింగ్ చేసారు.

ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ నుంచి గన్ ఒక లైవ్ గ్రౌండ్ ఒక షెల్ స్వాధీనం చేసుకున్నాము.

మొత్తం పదిమందిలో ఒక మహిళ ఉన్నారు పొలిటీషియన్స్, బిజినెస్ మెన్, రియాల్టర్స్ ఉన్నారు.

తాండూర్ ఎక్స్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్

మిగతా వారిలో ఏం రమేష్, వి శ్రవణ్ కుమార్, రితేష్ రెడ్డి,విజయ కృష్ణ,కౌశిక్ రవి, షరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఉన్నారు.

పదిమందికి టెస్ట్ చేస్తే ఐదుగురికి పాజిటివ్ వచ్చింది

కన్ఫర్మేషన్ కోసం బ్లడ్ శాంపిల్ హాస్పిటల్ కి పంపించాం

గన్ లైసెన్స్ ఉండి అది రితేష్ రెడ్డిది కాగా న‌మీత్ మిశ్రా ఫైర్ చేయడం జరిగింది.

పైలెట్ రోహిత్ రెడ్డి, నమిత మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి,అర్జున్ రెడ్డి కి డ్రగ్ పాజిటివ్ గా వచ్చింది.

ఫైరింగ్ ఎందుకు చేశారు అన్న విషయం పై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాన్ని బట్టి వైరింగ్ చేసిన వాళ్లపై యాక్షన్ ఉంటుంది

నెట్ వ‌ర్కింగ్ కోసం వీకెండ్ పార్టీ చేసుకున్నట్టుగా చెబుతున్నారు పైలట్ రోహిత్ రెడ్డి పార్టీ ఆర్గనైజ్ చేశారు.

పదిమందిలో ఒక మహిళ షరీఫ్ రెడ్డి వైఫ్ ఆఫ్ శ్రీధర్ రెడ్డి ఉన్నారు

తను కౌశిక్ రవితో కలిసి పార్టీకి వచ్చింది.

రెండు గ్రాముల వైట్ పౌడర్ ని సీజ్ చేసాము అది ఏ డ్ర‌గ్ అనేది టెస్ట్ తర్వాత చెప్పగలం.

పాజిటివ్ వచ్చిన ఐదుగురు ఇక్కడ డ్ర‌గ్

తీసుకోలేదు గతంలో వేరే దగ్గర తీసుకున్నామని చెబుతున్నారు కంప్లీట్ టెస్ట్ తర్వాత పూర్తిగా తెలుస్తుంది.

ఫామ్ హౌస్ ల మీద కార్డెన్ సర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాము… మాకు ఇంటలిజెన్స్ టీం కూడా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *