
- కల్వకుంట్ల కవిత
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ పథకం ప్రాజెక్టుపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజంటేషన్ లో అంతా గ్రాఫిక్స్ మాయ అని తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. మూసీ పై ఇప్పటి వరకు ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేయలేదన్నారు. ఒక్క ఫేజ్ 1కు సంబంధించిన డీపీఆర్ మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఫీజుబిలిటీ రిపోర్ట్ లో రూ. 5,641 కోట్ల ఖర్చు అవుందని ప్రభుత్వం చెప్పి ఆరు నెలల్లో మరో 1400 కోట్ల రుపాయాల అంచనా వ్యయాన్ని పెంచిందని ఆరోపించారు. మూసీ పై ఇచ్చిన పీపీకి నిర్వాసితులను ఆహ్వానించకుండా పూర్తి చేశారని ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి జూనియర్ మోడీ లా వ్యవహరిస్తున్నారన్నారు. హైడ్రా పేరుతో సీఎం రేవంత్ అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. హైడ్రా కమిషనర్ కు ఎన్నో ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ అనుసరిస్తున్న వైఖరిని కవిత ఎండగట్టారు. నాలాలు ఆక్ర మించి ఇళ్లు కడుతున్నా…మా పరిధిలోకి రాదని చెప్పడం హాస్యాస్పందగా ఉందన్నారు. ప్రభుత్వతీరును ఎండగడితే…. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు కలిసి తనను సోషల్ మీడియాలో ట్రోలో చేస్తున్నారన్నారు. నేను ఆధారాలు బయటపడితే ప్రభుత్వం, హైడ్రా బావిలో దూకాల్సి వస్తుందన్నారు. హై డ్రా సోషల్ మీడియా లో పెట్టిన పోస్టులు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. వెలుగుమట్లలో ఇళ్ల పట్టాలు ఇచ్చినా…..అందులో అనర్హులకు దక్కినట్లు తనకు సమాచారం ఉందని, త్వరలో మరోసారి పర్యటిస్తానన్నారు.







Leave a Reply