NewsInn

News in a Click

డ్ర‌గ్స్ కేసు- లాగితే చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు

-కేటిఆర్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన పైలెట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్ డ్ర‌గ్స్ కేసు సంద‌ర్బంగా బీఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఎక్స్ ద్వారా స్పందించారు. మాద‌క ద్ర‌వ్యాల‌కు, మ‌త్తు ప‌దార్థాల‌కు తాను వ్య‌తిరేకం అని స్ప‌స్టం చేశారు బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌వుల్లో ఉన్న వ్య‌క్తులు కూడా మాద‌క ద్ర‌వ్యాల‌ను వాడ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని చెప్పారు. బీఆర్ ఎస్ పార్టీ నేత‌లు చ‌ట్ట‌విరుద్ధ‌మైన ఎలాంటి కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డినా పార్టీ స‌హింద‌న‌న్నారు. ఎవ‌రైనా నిషేధిత మ‌త్తు ప‌దార్థాల‌ను వాడినా అమ్మినా వారిని రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా చ‌ట్ట ప్ర‌కారం శిక్షించాల్సిందే అన్నారు.

ఇదే స‌మ‌యంలో డ్ర‌గ్స్ అంశం తెర‌పైకి వ‌స్తే త‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌డాన్ని కేటిఆర్ త‌ప్పు బ‌ట్టారు. ఇది ప్ర‌తిప‌క్ష పార్టీల అనైతిక ఆరోప‌ణ‌లు అని విమ‌ర్శించారు. నేను మ‌ళ్లీ మ‌ళ్లీ చెబుతున్నా…ఎలాంటి ప‌రీక్ష‌కైనా తాను సిద్ధం అన్ని రాజ‌కీయ పార్టీల నేత‌లు కూడా డ్ర‌గ్స్ టెస్ట్ కు ఆహ్వానించాల‌నీ పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ ను కోరుతున్నాన‌న్నారు. మాద‌క‌ద్ర‌వ్యాల కేసులో త‌న‌ను అన‌వ‌స‌రంగా లాగితే చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *