NewsInn

News in a Click

మేము సిద్ధం – మీరు సిద్ధ‌మా…….!

(హైదరాబాద్,న్యూస్ఇన్‌)

మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫార్మ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ కేసును సాకుగా చూపి కేటీఆర్ పై పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న ప్ర‌చారాన్ని మాజీ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి త‌ప్పు బ‌ట్టారు. ఫార్మ్ హౌజ్ డ్రగ్స్ కేసులో పూర్తి స్థాయి, లోతైన మరియు పారదర్శక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరు ఉన్నా, వారు ఏ పార్టీకి చెందిన వారైనా, ఎంతటి పెద్దవారైనా సరే చట్టం ముందు సమానంగా కఠిన చర్యలు తీసుకోవాల‌న్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పై కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకొని ఆరోపణలు చేస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిజంగా కాంగ్రెస్ నేతలకు ధైర్యం ఉంటే అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కలిసి డ్రగ్ టెస్ట్ చేయించుకుందామని సవాల్ విసిరారు. రేపు అసెంబ్లీ సమావేశం అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో, కౌన్సిల్ లో కౌంటర్లు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ వరుసగా నిలబడి డ్రగ్ టెస్ట్ చేయించుకుందాం అని స‌వాల్ విసిరారు. .మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులందరూ డ్రగ్స్ టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నామ‌ని,కాంగ్రేస్ పార్టీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమా అని ప్ర‌శ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *