NewsInn

News in a Click

బిజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అరెస్ట్

బిజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అరెస్ట్

మెస్సీకి టూర్ కు ప్రభుత్వ‌ నిధులా…..!

సీఎం, భట్టి కు లింక్ ఏమిటో చెప్పిన ఏలేటి

(హైద‌రాబాద్, న్యూస్ఇన్‌)

ప్ర‌ముఖ ఫుట్ బాల్ క్రీడాక‌రుడు లియోన‌ల్ మెస్సీప‌ర్య‌ట‌నకు ప్రభుత్వం నిధులు వెచ్చించ‌డాన్నినిర‌సిస్తూ బీజెఎల్పీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం సింగ‌రేణి సంస్థ ముందు ధ‌ర్నా నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ…..మెస్సీ త‌మ‌కు అభ్యంత‌రం లేక‌పోయినా…… ప్ర‌భుత్వం ప్ర‌జా ధ‌నం దుర్వినియోగం చేస్తూ ఈ ప‌ర్య‌ట‌న‌ను పూర్తి చేసేందుకు నిర్ణ‌యం తీసుకోవ‌డం స‌మంజ‌సం కాద‌న్నారు. లియోనల్‌ మెస్సీ ఒక ఎగ్జిబిష‌న్ మ్యాచ్ ఆడితే, అప్పీయ‌రెన్స్ ఫీజు కింద రూ.70 కోట్లు తీసుకుంటార‌ని చూశాను. మెస్సీకి ఇచ్చే మొత్తంతో పాటు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందికి ఈ మొత్తం క‌లిపితే… రూ.వంద కోట్లకుపైగా ప్రభుత్వం ఖ‌ర్చు చేస్తున్న‌దన్నారు. సింగరేణి, పర్యాటక, క్రీడల శాఖల నుంచి నిధులను మెస్సీ టూర్‌ కు మళ్లించినట్టు త‌న‌కు సమాచారం ఉంద‌న్నారు.

Bjp Dharna

ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క త‌న సింగ‌రేణి శాఖ‌ను సీఎం రేవంత్ టీమ్ కు స్పాన్స‌రుగా ఉండ‌డానికి ఎందుకు అంగీక‌రించారో చెప్పాలి.సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క పూర్తిగా స‌రెండర్ అయ్యారు. భ‌ట్టి ఆర్ధిక శాఖ బిల్లుల క్లియ‌రెన్సుకు 30 శాతం క‌మిష‌న్లు తీసుకుంటున్నా సీఎం ప‌ట్టించుకోవ‌డం లేదని ఆరోపించారు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మ‌న‌వ‌రాలి పెళ్లి కోసం సీఎం రేవంత్ రెడ్డి అక్టోబ‌రు 31న ముంబై వెళ్లిన‌పుడు అక్క‌డ ఫుట్ బాల్ మ్యాచ్ ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్లు క‌లిశారు. అంటే హైదరాబాద్ లో ఫుట్ బాల్ మ్యాచ్ పెట్టాల‌నేది నెల రోజుల క్రితం డిసైడ్ అయింది. కానీ గ్లోబ‌ల్ స‌మ్మిట్ మూడు నెల‌ల క్రితం డిసైండ్ అయింది. మ‌రి వాస్త‌వాలు ఇలా ఉంటే సీఎం, మంతులు గ్లోబ‌ల్ స‌మ్మిట్ లో భాగంగా ఫుట్ బాల్ మ్యాచ్ అన‌డం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సింగరేణి సంస్థ ముందు ధర్నా చేస్తున్న మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *