-అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కేటిఆర్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చి వాటికి చట్టబద్దత కల్పిస్తామని వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పారని ఇప్పటి వరకు ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత లేదని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆరోపించారు. గన్ పార్క్ దగ్గర అమర వీరుల స్థూపం దగ్గర బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో కేటిఆర్ మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పిస్తదని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలు… ఇది మూడో గవర్నర్ ప్రసంగం అని గుర్తు చేశారు. రైతు బంధు విషయంలో కూడా ఎప్పుడు వేస్తారో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేదన్నారు. అందుకే ‘రాహుల్ బంధు కాదు, రైతుబంధు వేయండి’, ‘రాహుల్ కు 1000 కోట్లు, రైతులకు వెన్నుపోట్లా’ అని చెప్పి ఈ సభా సమావేశాల్లోనే బడ్జెట్ సమావేశంలో తప్పకుండా నిలదీస్తామని కేటిఆర్ అన్నారు. బలహీన వర్గాలకు లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు, రెండు బడ్జెట్లు అయిపోయినవి, ఇది మూడో బడ్జెట్ ఇప్పటి వరకు 60 వే లకోట్ల రుపాయాలు బీసీల కు బడ్జెట్ లో కేటాయించాలి కానీ దానిపై కూడా స్పష్టత లేదన్నారు.

దళిత బంధు 12 లక్షలు ఇస్తామన్నారు….ఆ పథకానికి అతీ గతీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు చూస్తుంటే ఆరు గ్యారెంటీలకు మంగళం పాడినట్లే కనిపిస్తోందన్నారు. జాబ్ క్యాలండర్ రాక పోయినా….ప్రతి ఏటా కొత్త క్యాలండర్లు మాత్రం వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫ్యలాలపై ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటిఆర్ అన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చే దుస్థితలో రాష్ట్ర ప్రభుత్వం లేదని ఇది ఖచ్చితంగా ఆర్ధిక శాఖ నిర్వహణ లోపమే అన్నారు.
అమరవీరులకు నివాళులు…..
శాసనసభ సమావేశాలకు ముందు ఆనవాయితీగా తెలంగాణ అమరవీరులకు, విద్యార్థి అమరవీరులకు నివాళులర్పించి ఇవాళ శాసనసభ సమావేశాలకు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు .ఎమ్మెల్యేలు గులాబీ చొక్కాలు ధరించి హాజరయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ….ఆరు గ్యారంటీలకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం హామీలు అమలు చేయని వాటిపై ప్లకార్డులు ప్రదర్శించారు.







Leave a Reply