58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరణ
(అమరావతి,న్యూస్ఇన్)
పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరామలు భారీ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శాఖమూరు పార్కులోని 6.80 ఎకరాల్లో అమరజీవి కాంస్య విగ్రహం నిర్మాణం ఆరు నెలల రికార్డు సమయంలోనే నిర్మాణం పూర్తి చేసింది. ఈ భారీ విగ్రహం కోసం 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ వినియోగించారు. రెండో దశలో మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టనుంది.

ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’. త్యాగానికి మానవరూపం పొట్టి శ్రీరాములు . వారి విగ్రహం ఏర్పాటు తెలుగుజాతి గొప్పతనాన్ని అమరావతి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని విద్య, ఐటీ శాఖల మంత్రి మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరజీవి.. చిరంజీవి. మరణంలేని గొప్ప శక్తి. త్యాగానికి మానవరూపం. ఆంధ్రప్రదేశ్ రూపంలో జీవించే ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి రోజు 58 అడుగుల విగ్రహం రూపంలో మనకోసం మళ్లీ జన్మించారు.
ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఈ ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’. డూండి రాకేష్ నా దగ్గరకు వచ్చి ఏం పేరు పెట్టాలనేదానిపై సలహా అడిగారు. అప్పుడు నా మనసులో తోచింది ఒక్కటే ఆ విగ్రహం చూస్తే ఆయన త్యాగం గుర్తుకురావాలి. అందుకే ‘స్టాచ్యూ ఆప్ శాక్రిఫైస్’ అని పెడదాం అని చెప్పాను. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం తెలుగుజాతి గొప్పతనాన్ని అమరావతి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళుతుందని లోకేష్ వ్యాఖ్యానించారు.
ఏపీ రాజకీయాల్లో పుట్టా మహేష్ కలకలం….









Leave a Reply