- సీఎం రేవంత్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యాయి. అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంలో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. ప్రజా ప్రభుత్వంలో ఇది మూడవ బడ్జెట్ అని, ఎంతో ప్రాధన్యత ఉందని వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఈ రోజు చేసిన ప్రసంగం ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలను గవర్నర్ తన ప్రసంగంలో వివరించారని సీఎం చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలపై ఇప్పుడు చర్చించాల్సిన సమయం అయిందని, ప్రజా ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు భవిష్యత్తులో ఏం చేయబోతున్నామన్నదానిపైనే చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.

సభలో చర్చలు జరుగుతున్న సమయంలో విప్ ల మద్య సమన్వయం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సభలో చర్చలు పక్కదారి పట్టకుండా, సమయం వృధా కాకుండా సమర్ధవంతంగా శాసనసభా సమావేశాలు జరుపాల్సిన అవసరం ఉందని సీఎం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ జానారెడ్డికి, భట్టి విక్రమార్కకు సభలో సబ్జెక్ట్ మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా వందశాతం హాజరు ఉండేలా చూసుకోవాలని, మహిళా ఎమ్మెల్యేలు కూడా రోజు సభకు హాజరు కావాలన్నారు. 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు.






Leave a Reply