
(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ ఫాం హౌస్ డ్రగ్స్ కేసులో ఓ ఎంపీ, ఓ మాజీ ఎమ్మెల్యే పట్టుబడడంతో రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ గా మారింది. ఈ సమయంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. సినీ రంగంలోనే డ్రగ్స్ మూలాలు ఎక్కువగా ఉంటాయని డ్రగ్స్ పరీక్షల తరువాతనే సినిమాలు విడుదల చేసేలా నిబంధనలు తేవాల్సిన అవసరం ఉందన్నరు. టెస్టు కు నిరాకరిస్తే ఆ సినిమా విడుదలను ఆపివేయాలన్నారు. ప్రజా ప్రతినిదుల కూడా 90రోజులకు ఒక సారి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించుకోవాలని ఆ టెస్ట్ కు నిరాకరిస్తే చట్టసభల్లోకి వారికి అనుమతి ఇవ్వరాదని అభిప్రాయ పడ్డారు.







Leave a Reply