
ప్రకటించిన ఏఐసీసీ
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం చేసుకునేందుకు ఏఐసీసీ కమిటీని ప్రకటించింది. ఏఐసీసీ ఖరారు చేసిన జాబితాను తెలంగాణా ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ విడుదల చేశారు. కమిటీలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిడబ్ల్యుసి సభ్యులు మంత్రి దామోదర రాజా నర్సింహా, మంత్రి సీతక్క , సిడబ్ల్యుసి సభ్యులు వంశీ చంద్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ కమిటీ లో సభ్యులు గా ఉంటారు. రాష్ట్రంలో అధికార పార్టీగా మంత్రులు, ఎమ్మ్యేలలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేయడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ నేతలతో ద్వారా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి చేయడం లక్ష్యంగా కమిటీ పనిచేయనుంది. రాష్ట్రంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలో కమిటీ పనిచేయనుంది.







Leave a Reply