(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా కాంగ్రెస్ లో ఆసక్తి కరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండున్నరేళ్ల సమయం అవుతోంది. మరో రెండున్నరేళ్ల పదవీ కాలం ఈ ప్రభుత్వానికి మిగిలి ఉంది. ఈ సమయంలో అధికార పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు పార్టీ నేతల్లో ఆందోళన రేపుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోవడం ఒక వంతైతే…. పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్క దిద్దడం మరో పరీక్షగా సీఎం రేవంత్ రెడ్డికి మారింది. ప్రతిపక్షాన్ని కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నా…. పెద్దగా ఇబ్బందులు ఉండవు. రాజకీయంగా అన్ని రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలుగానే చెప్పుకోవచ్చు.కానీ పార్టీ అంతర్గత వ్యవహారాలే అసలు సమస్యను సీఎం రేవంత్ రెడ్డి కి సృష్టిస్తున్నాయి.

రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు, కొత్తగా వచ్చిన నేతలకు మధ్య అంతర్గత విభేదాలు బహిరంగ రహస్యమే. మంత్రి వర్గం నుంచి కింది స్థాయి వరకు ఈ పరిస్థితి రాష్ట్ర కాంగ్రెస్ లో కనిపిస్తోంది. అధికార పార్టీగా అవతరించడంతో కొంత మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిబిరంలో కలిసిపోయారు. మరికొంత మంది మాత్రం నేతలు మాత్రం సీఎం రేవంత్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తో ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతల మధ్య స్పష్టమైన గ్యాప్ కనిపిస్తోంది. ప్రధానంగా జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణా రాజకీయాల్లోనే హాట్ హాట్ గా మారుతున్నాయి. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పాత కాపుగా రాజకీయాలు చేస్తున్నారు. బీఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో జీవన్ రెడ్డికి గడ్డు కాలం మొదలైంది. సంజయ్ చేరిన నాటి నుంచే నియోజవర్గంలో పార్టీ ఇరు వర్గాలుగా చీలి పోయింది. జీవన్ రెడ్డివర్గానికి చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యే పకడ్భంధీగా పావులు కదుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేకు పూర్తిగా సహకరిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు. పార్టీ లో సీనియర్ గా, సౌమ్యుడుగా ఉన్న జీవన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీలోని సీనియర్ నేతల్లో కూడీ ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా దాదాపు ఇదే పరిస్తితి ఉంది.
కేసీఆర్ తో చర్చలు……

అయితే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక కాంగ్రెస్ లో ఆయన కొనసాగడంపై అనుమానాలు పెంచుతున్నాయి. కొద్ది రోజుల క్రితం బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్బంగా పార్టీ అధినేత కేసీఆర్ తో కూడా ఫోన్లో జీవన్ రెడ్డి మాట్లాడినట్లు సమాచారం. కాంగ్రెస్ లో జరుగుతున్నప పరిణామాలపై విసిగిన జీవన్ రెడ్డి త్వరలో గులాబీ గూటికి చేరుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.జీవన్ రెడ్డి లాంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఆ పార్టీని వీడితే రాజకీయంగా ఇది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలమే అన్న సంకేతాలు వెళుతాయని కాంగ్రెస్ సీనియర్లలో అనుమానాలు మొలవుతున్నాయి. దీంతో జీవన్ రెడ్డిని ఎలాగైనా ఒప్పించి కాంగ్రెస్ లో కొనసాగించే లా చేయాలన్న లక్ష్యంగా సీనియర్లు కూడా రంగంలోకి దిగినట్లు సమచారం. తనకు ప్రాధాన్యత లేని చోట తాను ఉండలేనని స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన ఏఐసీసీ……







Leave a Reply