
(హైదరాబాద్,న్యూస్ఇన్)
మాజీ ఎమ్మెల్యే పెలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్ ఎస్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇటీవల తన ఫాం హోస్ లో డ్రగ్స్ కేసులో పైలెట్ పట్టుబడడంతో బీఆర్ ఎస్ పార్టీ ఆయన కు నేడు నోటీసులు జారీ చేసింది. మాదక ద్రవ్యాల వినియోగానికి పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని నోటీసుల్లో పేర్కొంది. డ్రగ్ కేసులో మీ హాజరు మరియు ప్రమేయంపై వచ్చిన ఆరోపణలు పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ఉండటంతో, ఈ విషయాన్ని పార్టీ అత్యంత సీరియస్ గా పరిగణిస్తోంది. పార్టీ అధినేత కేసిఆర్ ఆదేశాల మేరకు నోటీసు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. తదుపరి పార్టీ నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరాదని నోటీసుల్లో పేర్కొంది.
ఆ రోజు రోహిత్ రెడ్డి ఫాం హౌస్ లో ఏం జరిగింది…..







Leave a Reply