NewsInn

News in a Click

మొక్క జొన్న‌ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

మొక్క జొన్న‌ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

బీఆర్ ఎస్ నిర‌స‌న‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా బీఆర్ ఎస్ గ‌న్ పార్క్ ద‌గ్గ‌ర నిర‌స‌న తెలిపింది. మ‌క్క‌జొన్న‌ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక‌పోవ‌డంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని, ప్ర‌భుత్వం వెంట‌నే కొనుగోలు కేంద్రాల‌ను ప్రారంభించి మ‌ద్ద‌తు ధ‌ర‌తో పాటు బోన‌స్ ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని శాస‌న‌స‌భా ప‌క్ష ఉప‌నాయుకుడు హ‌రీష్ రావ్ డిమాండ్ చేశారు.

ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయ‌క‌పోవ‌డంతో ద‌ళారులు కొనుగోలు చేస్తున్నార‌ని, దీంతో రైతుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని మండిపడ్డారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర రైతాంగానికి ఇన్ పుట్ సబ్సిడీ అందడం లేదు. ప్రభుత్వం కేవలం మాటల్లో చెబుతున్నదే తప్ప, ఇప్పటివరకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సబ్సిడీ నిధులను విడుదల చేయడం లేదన్నారు.అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల జరిగిన నష్టంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వెంటనే నివేదికలు తెప్పించుకోవాలి. తక్షణమే ఎన్యూమరేషన్ చేసి నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించి ఆదుకోవాలి. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పక్షాన వ్యవసాయ శాఖ మంత్రిని డిమాండ్ చేశారు.

అడ్డుకున్న మార్షల్స్……

గ‌న్ పార్క్ ద‌గ్గ‌ర మొక్క జొన్న‌ల‌తో నిర‌స‌న తెలిపి ప్ర‌భుత్వానికి నిర‌స‌న తెలియ‌చేసేందుకు మొక్క జొన్న కంకుల‌తో అసెంబ్లీలోకి వెళ్తున్న బీఆర్ ఎస్ నేత‌ల‌ను మార్ష‌ల్స్ అడ్డుకున్నారు. మొక్క జొన్న‌ల‌తో అనుమ‌తి లేద‌ని పోలీసులు అడ్డుకోవ‌డంతో ఉద్రిక్త‌త ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న మొక్క జొన్న‌లను పోలీసులు బ‌ల‌వంతంగా తీసుకునే సంద‌ర్భంలో హ‌రీష్ రావ్ చేతికి స్వ‌ల్ప గాయ‌మైంది. పోలీసుల‌పై బీఆర్ ఎస్ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మేయిన్ రోడ్ పై ఉన్న ఎంట్ర‌న్స్ నుంచి లోప‌లికి వెళ్లినా….అసెంబ్లీలోకి స‌భ్యులు వెళ్లే దారిలో బీఆర్ ఎస్ నేత‌లు మ‌రోసారి నిర‌స‌న వ్య‌క్తం చేశారు.ఈ స‌మ‌యంలో కూడా పోలీసులు, బీఆర్ ఎస్ నేత‌ల‌కు మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. పోలీసులు బీఆర్ ఎస్ నేత‌ల చేతుల్లో ఉన్న మొక్క జొన్న‌ల‌ను అనుమ‌తించ‌కుండా….ఎమ్మెల్యేల చేతుల్లోంచి లాక్కొని అక్క‌డ చ‌ల్ల‌డంతో….. పోలీసుల తీరుపై బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లోనే ఎమ్మెల్యేలు, పోలీసుల మ‌ధ్య తోపులాట జ‌ర‌గ‌డం విశేషం. పోలీసులు ఎమ్మెల్యేల‌తో వ్య‌వ‌హ‌రించిన తీరు చ‌ర్చ‌నీయంశంగా మారింది.

జీరో చ‌క్ర‌వ‌ర్తి ఎవ‌రో చెప్పిన కేటిఆర్……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *