
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ప్రభుత్వం చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఒక మహాయజ్ఙం లాంటిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీఆర్ ఎస్ లేవనెత్తిన అభ్యంతరాలు అపోహలే అన్నారు. మూసీ నిర్వాసితలకు అదే ప్రాంతంలో అపార్ట్మెంట్స్ కట్టి పునరావసం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు భట్టి చెప్పారు. ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతంలో ఎంత మంది నివాసం ఉంటున్నారో వారందరికీ పునరావసం కల్పిస్తామని చెప్పారు. మా ప్రభుత్వం సామాజిక బాధ్యతతో ముందుకు వెళుతుందోన్నారు. బీఆర్ ఎస్ నేతల మాదిరిగా తాము ప్రచార ఆర్భాటం చేయడం లేదన్నారు. మూసి డెవలప్మెంట్ ప్రాజెక్టు వివరాలన్నీ వెబ్ సైట్ లో ఉన్నాయన్నారు. ఎవరైనా సలహాలు, సూచనలు ఇవ్వవచ్చన్నారు. మంచి సలహాలు ఉంటే స్వీకరించి ముందుకు వెళతామన్నారు.
బీఆర్ఎస్ వాకౌట్…..







Leave a Reply