–సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన
(హైదరాబాద్, న్యూస్ఇన్)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై మరో సారి చర్చలు ఊపందుకున్నాయి. ఈ సారి అసెంబ్లీ సమావేశాల అనంతరం క్యాబినెట్ లో ఖాళీగా ఉన్న రెండు పదవుల భర్తీతో పూర్తి స్థాయిలో శాఖల్లో కూడా మార్పులు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే పార్టీ హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ తీసుకునేందుకు సీఎం ఢిల్లీలో మకాం వేశారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లూ పూర్తి కావడంతో ఇంకా పూర్తి స్థాయి లో మంత్రి వర్గాన్ని కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేయలేకపోయింది. మంత్రి వర్గ విస్తరణకు ప్రతి సారి ఏదో ఒక అడ్డంకి వస్తుండడంతో ఎప్పటిక్పుడు వాయిదా పడుతోంది. అయితా తాజాగా సీఎం పర్యటనలో మంత్రి వర్గంపై స్పష్టత తీసుకోవాలన్న అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

మరో రెండు స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే ఈ స్థానాలను ఎవరికి కేటాయిస్తారన్నది కాంగ్రెస్ పార్టీలో ఆసక్తి రేపుతున్న అంశంగా మారిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మంత్రి వర్గంలో స్థానం కోసం మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎదురు చూస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా తనకు అన్ని అర్హతలు ఉన్నాయని అంటున్నారు. పార్టీ హై కమాండ్ ఇచ్చిన హామీ మేరకు తాను మంత్రి వర్గంలో స్థానం డిమాండ్ చేస్తున్నానని చెబుతున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి వర్గంలో ఉండడంతో రాజగోపాల్ రెడ్డి కి మంత్రి వర్గంలో స్థానం దక్కడం పై అందరిలోనూ అనుమానాలు ఉన్నాయి. కానీ గత కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి కూడా తన బలం నిరూపించుకునే పనిలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విబేదించే ఎమ్మెల్యేలతో తరచూ భేటీ అవుతున్నారని రాజకీయ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. గత వారంలో కూడా దాదాపు పది ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి రహస్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారన్న గుసగుసల వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే నిజామాబాద్ జిల్లాకు ఇప్పటి వరకు క్యాబినెట్లో చోటు దక్క లేదు. క్యాబినెట్ విస్తరణ జరిగితే ఆ జిల్లాకు చెందిన సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి ప్రమోషన్ ఇవ్వాలన్న యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాకు కూడా క్యాబినెట్లో చోటు లేదు…. ఇక్కడ కూడా అదే సామాజిక వర్గం నేతలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఈ సమీకరణలు కూడా రాజగోపాల్ రెడ్డికి రుచించడం లేదని తెలుస్తోంది. ఈ కారణంగా ఈ సారి మంత్రి వర్గం విస్తరణ జరిగితే చాన్స్ దక్కించుకోవాలని పార్టీ పెద్ద లతో కూడా రాజగోపాల్ రెడ్డి సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. మరొక్క స్థానం ఎవరికి దక్కుతుందనేది కూడా ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. అయతే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిపితే….. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో పలువురిని తొలగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముగ్గురు మంత్రులను తొలగించి ఆ స్థానాలతో పాటు మరో ఇద్దరిని కొత్తగా చేర్చుకుని క్యాబినెట్ మొత్తం ఒకే సారి పునర్వ్యస్థీకరించాలన్న యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఏర్పాటు చేసే క్యాబినెట్ టీంతో నే మరోసారి ఎన్నికలకు వెళ్లాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి గా తన పేరును ముందుకు తెస్తూ వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటామని సీఎం రేవంత్ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో సీఏం సన్నిహితులకే మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
మూసీపై భట్టి వ్యాఖ్యలు తెలుసా……







Leave a Reply