NewsInn

News in a Click

ఫాం హౌస్ డ్ర‌గ్స్ కేసు విచార‌ణ‌- విస్తుపోయే నిజాలు

ఫాం హౌస్ డ్ర‌గ్స్ కేసు విచార‌ణ‌- విస్తుపోయే నిజాలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి డ్ర‌గ్ కేసు విచార‌ణ‌లో పోలీసులు దూకుడు పెంచారు. సీపీ సుధీర్ భాబు ఈ కేసు గురించి ఆరా తీశారు. శంశాబాద్ పోలీస్ స్టేష‌న్లో కేసుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు పోలీసు అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. శ‌నివారం సాయంత్రం మాద‌క‌ద్ర‌వ్యాల‌తో పార్టీ చేసుకుంటున్నార‌న్న స‌మాచారంతో ఈగ‌ల్ పోలీసులు ఫాం హౌస్ లో సోదాలు నిర్వ‌హించేందుకు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ‌చోటు చేసుకున్న ప‌రిణామాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ గా మారాయి. ఇక్క‌డ తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మ‌హేష్ తో పాటు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స‌హా మ‌రో 9 మంది ఉన్నారు. వీరంతా ఫాం హౌస్ లోని స్విమ్మింగ్ స‌మీపంలో పార్టీ చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల‌ను కూడా గ‌మ‌నించిన ఈ బృందంలోని స‌భ్యుడున‌మీత్ శ‌ర్మ గాలి లోకి నాలుగు రౌండ్ల కాల్పులు జ‌రిపారు. దీంతో కేసును పోలీసులు మ‌రింత సీరియ‌స్ గా తీసుకున్నారు.

అలెర్ట్ అయిన పోలీసులు వారికి సెర్చ్ వారంట్ ఇవ్వ‌డంతో పాటు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డ న‌మీత్ శ‌ర్మ‌ను ముందుగా అదుపులోకి తీసుకుని రివాల్వ‌ర్ స్వాధీనం చేసుకున్నారు. ఆ త‌రువాత పార్టీలో ఉన్న ఒక్క‌క్క‌రి గురించి ఆరా తీయ‌డంతో తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్,మాజీ ఎమ్మెల్యు పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయ‌న సోద‌రుడు రితీష్ రెడ్డిలు స‌హా అక్క‌డున్న వారంతా త‌మ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. పోలీసుల‌ను చూసి గాలి లోకి కాల్పులు జ‌ర‌ప‌డంతో పోలీసులు ఆర్మ్ యాక్ట్ తోఓ పాటు హ‌త్య య‌త్నం కేసుల‌ను ఈ ముగ్గురిపై న‌మోదు చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఈ ముగ్గురు కూడా సీరియ‌స్ నేరాన్ని ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఇప్పటికే చంచ‌ల్ గూడ జైల్లో ఉన్న వారితో పూర్తి వివ‌రాలు రాబ‌ట్టేందుకు పోలీసు శాఖ దృష్టి పెట్టింది. డ్ర‌గ్స్ ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి. ఎప్ప‌టి నుంచి వినియోగిస్తున్నారు….డ్ర‌గ్ రాకెట్ లో ఎవ‌రున్నారన్న దానిపై పోలీసులు ఆరా తీయ‌డం మొద‌లు పెట్టి న‌ట్లు తెలుస్తోంది.

పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో సిమ్లా నుంచి డ్ర‌గ్స్ తెచ్చామ‌ని ముందుగా చెప్పిన నిందితులు…ఇప్పుడు వాస్త‌వాల‌ను పోలీసుల‌కు తెలియ‌చేసిన‌ట్లు స‌మాచారం. హైద‌రాబాద్ లోని హై టెక్ సిటీ ప్రాంతంలోనే డ్ర‌గ్స్ కొనుగోలు చేసిన‌ట్లు రోహిత్ రెడ్డి డ్రైవ‌ర్ విష‌యాన్ని వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం. అభిషేక్ అనే సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ తో ఈ డ్ర‌గ్స్ గ‌త కొన్నేళ్లుగా కొంటున్నారని పోలీసులు గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. శ‌నివారం కూడా ఓఆర్ ఆర్ స‌మీపంలోనే డ్ర‌గ్స్ కొన్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అభిషేక్ ను అదుపులోకి తీసుకోవాల‌ని పోలీసులు దృష్టి పెట్టారు. అయితే అభిషేక్ పై గ‌తంలో కూడా డ్ర‌గ్స్ కేసులు ఉన్న‌ట్లు పోలీసు అధికారులు గుర్తించారు.

రోజు ఏం జ‌రిగిందంటే….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *