మానవ హక్కుల కమిషన్ సిఫారసు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఖమ్మం గిరిజన వసతి గృహంలో 10 ఏళ్ల వయస్సునన దేవత్ జోసెఫ్ మృతి వసతి గృహ అధికారుల నిర్లక్ష్యం వల్లేజరిగిందని తెలంగాణా మావన హక్కుల సంఘం నిర్ధారణకు వచ్చింది. అధికారుల పర్యవేక్షణలోఉన్న విద్యార్థి అధికారుల ఉదాసీనత వల్ల చోటు చేసుకుందని అభిప్రాయపడింది. తెలంగాణా మావనహక్కుల సంఘం కమిషన్ చైర్మన్ జస్టీస్ షమీమ్ ఆక్తర్ ఈ కేసును విచారించారు.

మృతి చెందిన బాలుడి తల్లి—చెవిటి, మూగ స్థితిలో ఉందని తనకుమార్తె తో పాటు అత్తను పోషించాల్సిన బాధ్యతను ఒంటరి జీవితాన్ని తడుపుతున్న ఆమెను ప్రభుత్వం అవసరమైన నిబంధనలను సడలించి లాస్ట్ గ్రేడ్ కేటగిరీలో రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని, రూ.5,00,000 పరిహారం మంజూరు చేయాలని సూచించింది., ఇది మానవతా దృక్పథంతో, గౌరవం మరియు మౌలిక హక్కులను కాపాడే చర్యగా పేర్కొంటూ, కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఫార్సు చేసింది. ఆరు నెలల్లో ఈ సిఫారసులను అమలు చేయాలని సూచించింది.





Leave a Reply