రాజ్యసభలో మంత్రి వైష్ణవ్ వెల్లడి
(హైదరాబాద్, న్యూస్ ఇన్)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వికారాబాద్- నారాయణపేట-మక్తల్ (కృష్ణ) కొత్త రైల్వే లైన్ కు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) తయారీకి రైల్వే శాఖ ఆదేశించిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇప్పటికే ఈ రైల్వే లైనుకు ఫీల్డ్ సర్వే పూర్తయిందని, డి పి ఆర్ జరుగుతోందని వెల్లడించారు.

ఇది పూర్తి అయిన తర్వాత- ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్ ల నుంచి అనుమతులు రావాల్సి ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత బడ్జెట్లో చేరుస్తామని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే లైన్ పనులపై వేగంగా నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రైల్వే లైన్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుండడంతో ఈ పనులకు కేంద్రం కూడా ఎప్పటికప్పుడు పచ్చ జెండా ఊపుతోంది.రైల్వే లైన్ వికారబాద్ నుంచి కోడంగల్ నియోజకవర్గం మీదుగా నారాయణపేట జిల్లా క్రిష్ణా రైల్వే స్టేషన్కు కలిసేలా ప్రతిపాదనలున్నాయి.ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రం తీసుకున్ననిర్ణయంతో మరో అడుగు ముందుకు పడ్డట్లు అయింది.





Leave a Reply