
(అమరావతి,న్యూస్ఇన్)
వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, భారతి దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ పంచెకట్టు, భుజాన కండువాలో ఉగాది వేడుకలకు జన్మోహన్ రెడ్డి హాజరయ్యారు.ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం కార్యక్రమానికి వచ్చిన జగన్ దంపతులకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఉగాది ఉత్సవాల్లో పార్టీ ముఖ్యనేతలు, నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. పూజ తర్వాత పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు.
అనంతరం జగన్ దంపతులకు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్ధప్రసాదాలను పండితులు అందించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాంకాక్షలు తెలిపారు.







Leave a Reply