NewsInn

News in a Click

ప్ర‌ధాన న‌గ‌రాల్లో నిద్ర లేమి స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం

ప్ర‌ధాన న‌గ‌రాల్లో నిద్ర లేమి స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

దేశంలోని ప్ర‌ధాన మెట్రో న‌గ‌రాల్లో జీవ‌నం సాగిస్తున్న మెజార్టీ ప్ర‌జ‌లు నిద్ర‌లేలమి రాత్రుల‌తో గ‌డుపుతున్నారు. అర్ధ‌రాత్రి త‌రువాత నిద్రిండ‌చం.. క‌నీసం ఆరు గంట‌లు కూడా స‌రైన నిద్ర లేక‌పోవ‌డం వంటి అంశాలు ఒక అధ్య‌య‌నంలోఓ వెలుగు చూశాయి. తద్వారా ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతున్నాయ‌ని వైద్యులు గుర్తించారు. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో త‌క్కువ నిద్ర పోతున్న న‌గ‌రాల‌ను ప‌రిశీలిస్తే ముంబాయి మొద‌టి స్థానంలో ఉంది. దాదాపు 77 శాతం మంది అర్ధ‌రాత్రి దాటిన త‌రువాతే నిద్ర కు ఉప‌క్ర‌మిస్తున్నార‌ని అధ్య‌య‌నం లో తేలింది. ఈ కార‌ణంగానే 60 శాతం మంది కార్యాల‌య ప‌నివేళల్లో నిద్ర పోతున్నార‌ని ఆ సంస్థ అంచ‌నా వేసింది. నిద్ర‌లేమితో గ‌డుపుతున్న న‌గ‌రాల జాబితాలో హైద‌రాబాద్ కు కూడా చోటు ద‌క్కింది. దాదాపు 43 శాతం మంది మంద్రి రాత్రి పూట స‌రైన స‌మ‌యానికి నిద్ర పోవ‌డం లేద‌ని తేలింది. అయినా నిద్ర‌లేమితో బాధ‌ప‌డే వారి సంఖ్య 32 శాతం ఉంద‌ని తేలింది. దీంతో హైద‌రాబాద్ బ్యాలెన్స్ డ్ సిటీగా గుర్తించారు. చెన్పైలో మాత్రం 24 శాతం మంది మాత్ర‌మే అల‌స్యంగా నిద్ర పోతున్నార‌ట‌. ఈ అధ్య‌య‌నంలో న‌గ‌రాల వారిగా జాబితా….

ముంబయి
– 76.5% మంది అర్థరాత్రి తర్వాత నిద్ర
– 60% మంది పని వేళల్లోనూ నిద్రతో తూగటం

ఢిల్లీ
– 45% మంది ఉదయం చాలా ఆలస్యంగా నిద్ర లేవటం
– ఈ విషయంలో దేశంలోనే టాప్

కోల్కతా
– 75.5% మంది రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోయే అలవాటు

బెంగళూరు
– 36.3% మంది అర్థరాత్రి తర్వాత నిద్ర
– 54% మందికి నిద్ర తర్వాత కూడా విశ్రాంతి లేదన్న భావన

చెన్నై
– క్రమశిక్షణ కలిగిన సిటీ
– కేవలం 23.8% మంది మాత్రమే ఆలస్యంగా నిద్ర లేవటం

హైదరాబాద్
– 42% మంది ఆలస్యంగా నిద్ర
– 31% మందికే నిద్రలేమి సమస్య
– ‘బ్యాలెన్స్‌డ్ స్లీపర్ సిటీ’గా గుర్తింపు

ముఖ్య కారణం…….
87.6% మంది నిద్రకు ముందు మొబైల్ ఫోన్ వాడకం
46% మంది రోజుకు 6 గంటలకంటే తక్కువ నిద్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *