- మాజీ మంత్రి హరీష్ రావ్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా లో ఈ ఆర్ధిక సంవత్సరం ప్రవేశ పెట్టిన బోగస్ బడ్జెట్ అని,దీని ద్వారా ప్రజలకు ఎలాంటి ఉపయోగంలేదిన బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావ్ ప్రభుత్వ బడ్జెట్ పై స్పందించారు.ఆరు గ్యారెంటీలు అని ఊదరగొట్టిన పథకాలకు ఈ బడ్జెట్ లో కూడా ఎలాంటి కేటాయింపులు ప్రత్యేకంగా లేవన్నారు. గత బడ్జెట్ కు ఈబడ్జెట్ కు 20 పేజీలు పెంచి 20 వేల కోట్ల బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని ఆరోపించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఈబడ్జెట్ ఓ ఎలాంటి కేటాయంపులు లేన్నారు.
గత బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసం కోసం 6వేల కోట్లు కేటాయించామనిచెప్పారు…. ఈసారి 6వేల కోట్లు మళ్లీ కేటాయంచారు. ఈ పథకం ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. ఇందిరా, రాజీవ్ గాంధీల పేర్లు ప్రస్తావిస్తూ… వారి ఆత్మ క్షోభించేలా చేస్తున్నారన్నారు.ఈ బడ్జెట్లో కూడా పెన్షన్ల పెంపు లేదు, రైటైర్డ్ ఉద్యోగుల బెనిపిట్స్ ప్రస్తావన లేదన్నారు. అన్ని వర్గాలకు మొండి చేయి చూపించేలా బడ్జెట్ ఉందన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అప్పులు చేసిన చరిత్ర ఈ ప్రభుత్వానికి దక్కుతుందని ఎద్దేవా చేశారు.గురుకులాల్లో తిండి పెట్టే దిక్కు లేదు అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కూళ్లు అంటూ ఆర్భాటాలు చేస్తున్నారన్నారు.

బడ్జెట్ లో భట్టి విక్రమార్క దేశసగటు కన్నా తెలంగాణా జీఎస్డీపీ అధికంగాఉందంటారు…సీఎం రేవంత్ మాత్రం రాష్ట్రం దివాళా తీసిందని అంటారు. ఇది నిజమో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ అనే నినాదాన్న చెబుతున్నకాంగ్రెస్కా.. చోర్ మోడల్, గోల్ మాల్ మోడల్ గా మార్చిందన్నారు. బీఆర్ఎస్ హాయంంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు నియామకపత్రాలు ఇచ్చి 60వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. మహాలక్ష్మి పేరిటప్రభుత్వం ఆర్టీసీకి 2800 కోట్ల బకాయి పడింది. ఆర్టీసికి,9222 కోట్లు ఇచ్చి ఉంటే ఆర్టీసీ 3వేల కోట్ల అప్పులు ఎందుకు చేసిందని ప్రశ్నించారు.
బడ్జెట్ లో గత ఏడాది- ఈ ఏడాది కేటాయింపులు తెలుసా…..









Leave a Reply