(మెదక్,న్యూస్ఇన్)
టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యం లో సంగారెడ్డిలోని రామ్ నగర్ రామ్ మందిర్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. జగ్గారెడ్డి స్వయంగా పాటలు పాడుతూ, భక్తి గీతాలు ఆలపిస్తూ భజన లో పాల్గొన్నారు. పేలాల లడ్డు ప్రసాదం తో భజన కీర్తనలు పాడుతూ రాంనగర్ లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం రాంమందిర్ లో శ్రీ కృష్ణ భగవానుడి ఉట్టి కొట్టడం నిర్వహించారు. అనంతరం తర,తరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం ఆ దేవాలయం నుండి పేలాల లడ్డూ ప్రసాదాన్ని భక్తుల పైకి విసిరేశారు.

ఉగాది రోజు ఈ లడ్డూ ప్రసాదాన్ని అందుకుంటే అదృష్టం వరిస్తుందని భక్తులకు నమ్మకం. ఈ ప్రసాదాన్ని అందుకోవడానికి వేలాది మంది భక్తులు రామ్ మందిర్ కు చేరుకుని ప్రసాదాన్ని అందుకోవడానికి పోటీలు పడ్డారు.






Leave a Reply