- చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి సంకేతాలు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
గత ప్రభుత్వ హాయంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చట్ట ప్రకారం అరెస్టులు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఆరు వేల ఫోన్లు గత ప్రభుత్వ హాయంలో ట్యాప్ అయ్యాయన్నారు. ఈ కేసులో అధికారుల విచారణ జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే అరవింద్ కుమార్ ను సస్పెండ్ చేసిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. ఈ కేసు విచారణలో తనను విచారణకు ఆహ్వానించినా దర్యాప్తు సంస్థ ముందు హాజరై తనకు తెలిసిన సమాచారం పంచుకుంటానన్నారు. కేసు విచారణలో భాగంగా ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చిందని హరీష్ రావు అసత్య ప్రచారం చేసుకుంటున్నారన్నరు.

హరీష్ రావ్ పై పంజాగుట్టలో నమోదైన కేసు వరకే కోర్టు ఆదేశాలని సీఎం అన్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రోహిత్ రెడ్డి ఫాం హౌస్ డ్రగ్స్ కేసులో బీజేపీ ఎందుకు స్పందించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కేసు గురించి ఆ పార్టీ కీలక నేతలు స్పందించక పోవడాన్ని ఆయన తప్పుబట్టారు. బడ్జెట్ అనంతరం మీడియాతో ఇష్టా గోష్టిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన అప్పుల్లో 3.30 లక్షల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పు చెల్లించామని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 17 వేల కోట్ల రుపాయాలు మాత్రమే వాడుకుందని వెల్లడించారు.
మూసీ ని పూర్తి చేసి తీరుతాం……
మూసీ పునరుజ్జీవ పథకాన్ని పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సారి వ్యాఖ్యలు చేశారు. ఇది చారిత్రకంగా నిలిచి పోతుందన్నారు. మూసీలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, నాడు నోటీసులు లేకుండా కూల్చి వేతలను కేసీఆర్ , కేటిఆర్ అన్నారన్నారు అదే ప్రజల ముందు ఉంచానని రేవంత్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అముల చేస్తోందన్నారు.
హిల్ట్ పాలసీ పై విచారణకు సిద్ధం….
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేందుకు నిర్ణయించిన హిల్ట్ పాలసీప కేటిఆర్, హరీష్ రావు లు ఏ విచారణ కోరినా ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన భూ బదలాయింపులపై విచారణ చేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు.

విద్యా విధానంలో మార్పులు…..
కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో మార్పులు తెస్తామని,ప్రీ ప్రైమరీ నుంచి ప్లస్ టూ వరకు ఒకే చోట ప్రభుత్వ పాఠ శాలలో చదివే విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యా రంగంతో పాటు ప్రజారోగ్య సంస్కరణలకే అత్యధికంగా బడ్జెట్ నిధులు కేటాయించామన్నారు.
ఇది ఫ్యూచర్ బడ్జెట్……










Leave a Reply