NewsInn

News in a Click

​​మెస్సితో ఫుట్ బాల్ మ్యాచ్… మేస్త్రి కోట్లు ఖర్చు

​​మెస్సితో ఫుట్ బాల్ మ్యాచ్… మేస్త్రి కోట్లు ఖర్చు

ఫుట్ బాల్ పై ఉన్న శ్రద్ధ పిల్లల ఆరోగ్యం పై శ్రద్ధ లేదు

హామీల అమలు నా జిమ్మెదారి అన్న రాహుల్ మొహం చాటేస్తున్నారు

విద్యార్థులను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు

(హైదరాబాద్,న్యూస్ఇన్)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెస్సితో ఫుట్ బాల్ ఆడడంపై ఉన్న ధ్యాస…. విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడడంపై లేదని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. మెస్సి తో పోటీపడేందుకు మేస్త్రి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. బాగ్ లింగంపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రిలో చేరిన విద్యార్థులను హరీష్ రావు పరామర్శించారు. మెస్సి తో ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించేందుకు వస్తున్న రాహుల్ గాంధీ పై కూడా హరీష్ తీవ్ర విమర్శలు చేశారు. రైతులు, విద్యార్థుల సమస్యలపై రాహుల్ స్పందించకుండా మేస్త్రి ఆడుతున్న ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు టైం తీసుకొని వస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు.​ 100 కోట్లు ఖర్చుపెట్టి ఫుట్బాల్ ఆడడం ఎందుకని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక గురుకుల పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలవుతున్నారు. మొన్న షామీర్ పేట్ లో బీసీ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఏకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విద్యార్థులే ఫిర్యాదు చేశారన్నారు. రేవంత్ రెడ్డి విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇది విజన్ 2047 కాదు.. విద్యార్థుల పాలిట పాయిజన్ 2047 గా మారిందని ఆరోపించారు. ఆసుపత్రిలో చేరిన విద్యార్థులు తిరిగి మళ్లీ హాస్టల్ కి వెళ్ళము అని భయపడి చెబుతున్నారు.టీవీ యాడ్లు, పేపర్ యాడ్ల కోసం మాత్రమే తెలంగాణ రైసింగ్. వాస్తవంలో గురుకుల, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హాస్పిటల్స్ లో ఫాలింగ్.రాష్ట్రంలో అవినీతిలో రైసింగ్…. అరాచకంలో రైసింగ్. అహంకారంలో లేక కబ్జాలో రైసింగ్.రేవంత్ రెడ్డి కబ్జాలకు, సోకులకు, కమిషన్లకు టైం సరిపోవడం లేదు.. విద్యార్థులను ఎలా పట్టించుకుంటావన్నారు.ఢిల్లీకి పోవడానికి 61 సార్లు టైం ఉంది కానీ ఆసుపత్రి పాలయిన విద్యార్థులను పరామర్శించడానికి టైం లేదా అని ప్రశ్నించారు.

ఆరు గ్యారెంటీలకు నాది జిమ్మెదారి అన్న రాహుల్ గాంధీన్రాష్ట్రంలో దాదాపు 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే రారు, 160 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రాడు. 116 మంది విద్యార్థులు చనిపోతే రాడు.42% రిజర్వేషన్ కోసం బీసీలు పోరాటం చేస్తున్నా రాడు.
రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా ముఖం చాటేసి, ఈరోజు ఫుట్ బాల్ చూడడానికి వస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు.విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ప్లాఫ్ అయ్యాడు. త్రీ ట్రిలియన్ ఎకానమీ, ఫ్యూచర్ సిటీ అని గొప్పలు చెప్పడం కాదు.. ముందు హాస్టల్ పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *