(శ్రీశైలం, న్యూస్ఇన్)
పవిత్ర పుణ్యక్షేత్రంలో భద్రతా వైఫల్యం మరోసారి వెలుగు చూసింది. ఆలయ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో ఓ భక్తులు మొబైల్ ఫోన్ తో ఆలయంలోకి ప్రవేశించారు. గర్భాలయంలోని మల్లికార్జున స్వామిని వీడియో తీసారు. అప్పటి వరకు కూడా భద్రతా సిబ్బంది పెద్దగా పట్టిచుకోలేదని వీడియోను చూస్తే తెలిసిపోతుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ దీన్ని తన పార్టీ హ్యాండిల్ లో పోస్టు చేసింది. శ్రీశైలంలో అపచారం అంటూ…క్యాప్షన్ పెట్టింది….శివ….శివ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆలయ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు ఎదురౌతున్నాయి. భక్తులు ఫోన్లతో కూడా లోపలకి అనుమతించే స్థాయిలో భద్రతా వైపల్యం వెలుగు చూడడం ఆలయ అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఆలయ అధికారులు దీనిపై ఇప్పటి వరకు స్పందించకపోవడం విశేషం.







Leave a Reply