(తిరుమల,న్యూస్ఇన్)
నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్బంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో సహా దర్శనం చేసుకున్నారు. శనివారం ఉదయం దర్శనం చేసుకున్న బాబు సామాన్య ప్రజలతో మాట్లాడారు. తిరుమలలో అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. సీఎం తన కాన్వాయ్ లో వెళూతు ప్రజలతో మాట్లాడి తిరుమల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

లడ్డూ ప్రసాదం నాణ్యతపై బాబు ప్రజల అభిప్రాయం అడిగారు. మెరుగుపడిందని, ఇంకా మెరుగు బడాల్సిన అవసరం ఉందని భక్తులు సీఎం చంద్రబాబు కు చెప్పారు. దర్శనం వేగంగా జరిగేలా చూడాలని పలువురు భక్తులు సీఎం చంద్రబాబు నుకోరడంతో ఏఐ ఆధారిత సేవల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వారికి తెలిపారు. భక్తుల సౌకర్యం కోసమే టీటీడీ ఏఐ ఆధారిత సేవలను వినియోగించుకుంటుందని సీఎం భక్తులకు తెలియచేశారు. సామాన్య భక్తులతో చంద్రబాబు కలుసుకోవడంతో భక్తుల్లో కూడా కొంత జోష్ నిండింది.

తిరుమల లో పెరుగుతున్న రద్దీ దృష్యా సామాన్య ప్రజలకు దర్శనం సులువుగా అయ్యేందుకు ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ రూంను చంద్రబాబు పరిశీలించారు. భక్తులకు వేగంగా, శ్రీవారి దర్శనం కలిగేలా సమర్దవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఏఐ ఆధారిత సమీకృత కమాండ్ కంట్రోల్ రూం కావడంతో తిరుమల జన సాంధ్రత, దర్శనం కోసం వేచి ఉండే భక్తులు, వారికి అందించే సౌకర్యల వంటికి రియల్ టైంలో పర్యవేక్షించే అవకాశం ఉంది. ఈ కమాండ్ కంట్రలో రూంతో ఏఐ ఆధారితంగా విశ్లేషణ చేసి రద్దీ పెరిగే పరిస్థితులను అంచనా వేసి క్యూ లైన్ మేనేజ్ మెంట్ సమర్దవంతంగా నిర్వహించే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇది దేశంలోని అన్ని ఆలయాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
శ్రీశైలంలో భద్రతా వైఫల్యం……

అనంతరం కుటుంబసభ్యులతో కలిసి తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద ఆలయంలో భక్తులకు వడ్డించారు. భక్తుల మధ్యలోనే చంద్రబాబు కుటుంబ సభ్యులు అన్న ప్రసాదం స్వీకరించారు. తిరుమలలో శనివారం ఒక్క రోజు అన్న ప్రసాదానికి అయ్యే రూ.44 లక్షల విరాళం దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా నారా లోకేష్ ప్రకటించారు.








Leave a Reply