- రికార్డు స్థాయిలో జరిమానాలు వసూలు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో టికెట్ లేకుండా ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. జనరల్ బోగీలు ప్రజల అవసరాలకు అనుగుణంగా లేకపోయినా….రిజర్వ్ డ్ బోగీల్లో తమ ప్రయణాలు చేస్తూనే ఉన్నారు. అయితే రైల్వే శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత ఏడాది కంటే ఈ ఏడాది టికెట్ లేకుండా ప్రయాణాలు చేసి వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. టికెట్ లేని ప్రయాణికుల నుంచి వసూలు చేసే ఈ జరిమానాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. టికెట్ తనిఖీల్లో ఈ ఏడాది దక్షిణ మధ్య రైల్వే రూ..223.60 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇది రికార్డు ఆదాయంగా రైల్వే శాఖ చెబుతోంది. టికెట్ లేని ప్రయాణికుల దగ్గర ఈ స్థాయిలో జరిమానాలు విధించి వసూలు చేశారంటే..ఇది ఖచ్చితంగా రైల్వే శాఖను మరో వైపు ఆందోళనకు గురి చేసే అంశంగానే మనం చెప్పుకోవచ్చు. గతంలో ఏ ఆర్ధిక సంవత్సరంలో కూడా దక్షిణ మధ్య రైల్వే ఈ స్థాయిలో జరిమానాల రూపంలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయలేదు.
హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ మూడు రైళ్ల గురించి తెలుసా……..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రైల్వే బోర్డు నిర్దేశించిన రూ . 221.08 కోట్ల లక్ష్యాన్ని, సంవత్సరం ముగియడానికి 14 రోజుల ముందే ఈ జోన్ అధిగమించింది. ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా టికెట్ తనిఖీ ద్వారా వచ్చిన అత్యధిక ఆదాయం ఇదే. ఇంతకు ముందు 2023-24 సంవత్సరం లో రూ . 220.81 కోట్ల ఆదాయం అత్యుత్తమంగా నమోదైంది. టికెట్ లేని ప్రయాణం, ముందుగా బుక్ చేయని లగేజీ మొదలైన వాటిపై నమోదైన కేసుల ద్వారా ఈ ఆదాయం ఆర్జించబడింది. ఈ జోన్ ప్రస్తుత సంవత్సరంలో, 2025 అక్టోబర్ 18 న ఒకే రోజులో టికెట్ తనిఖీ ద్వారా రూ . 1.85 కోట్ల రికార్డు ఆదాయాన్ని కూడా ఆర్జించింది.

రైల్వే ప్రయాణికుల్లో బాధ్యతా యుతంగా ప్రయాణం చేసేందుకు రైల్వే శాఖ ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నా…టికెట్ లేకుండా ప్రయాణాలు చేస్తున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. రైళ్లలో టికెట్లు కొనేందుకు రైల్వే శాఖ సులువైన డిజిటల్ అవకాశాలను కూడా అందుబాటులోకి తెచ్చింది. రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన రైల్వే కమర్షియల్ అధికారులను జీఎం సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ అభినందించారు.











Leave a Reply