NewsInn

News in a Click

మ‌లుపులు తిరుగుతున్న ‘డ్ర‌గ్స్’ కేసు

మ‌లుపులు తిరుగుతున్న ‘డ్ర‌గ్స్’ కేసు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్ డ్ర‌గ్స్ కేసు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు డ్ర‌గ్ సంబంధిత అంశాల‌పైనే దృష్టి పెట్టిన పోలీసులు ఫాం హౌస్ అన్ని ప‌రిణామాల‌పైనా ఆరా తీస్తున్నారు. మ‌రో వైపు ఈ ఫాం హౌస్ అసైన్డ్ భూమి గా రెవెన్యూ అధికారులు గుర్తించారు.అసైన్డ్ భూమి అయినా…పైలెట్ రోహిత్ రెడ్డి కుటుంబ స‌భ్యుల పేర్ల‌పైకి ఎలా మారింద‌న్న దానిపై అధికారులు దృష్టి పెట్టారు. కేసును ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో ఎటు వైపు దారి తీస్తుందో అన్న అనుమానాలు మొద‌ల‌వుతున్నాయి.

అదుపులో అభిషేక్ సింగ్….

కేసు ద‌ర్యాప్తు కోసం ప్ర‌భుత్వం సిట్ ను నియ‌మించింది. సిట్ కేసు విచార‌ణ‌లో వేగం పెంచింది. డ్ర‌గ్స్ కొనుగోలు సిమ్లాలో చేశామ‌ని పైలెట్ రోహిత్ రెడ్డి టీం ఆ రోజు పోలీసుల‌కు విచారణ సమ‌యంలో స్ప‌ష్టం చేసింది ఆ త‌రువాత జ‌రిగిన విచార‌ణ‌లో హైద‌రాబాద్ లోనే డ్ర‌గ్స్ కొనుగోలు చేశార‌ని, డ్ర‌గ్స్ అమ్మంది అభిషేక్ అని పోలీసులు గుర్తించి అభిషేక్ ను కూడా తాజాగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో పైలెట్ రోహిత్ రెడ్డికి అభిషేక్ కు ఎప్ప‌టి నుంచి ప‌రిచ‌యం ఉంది….అభిషేక్ డ్ర‌గ్ క‌స్ట‌మ‌ర్లు ఎవ‌ర‌న్న దానిపై కూడా పోలీసులు విచార‌ణ మొద‌లు పెట్టారు. అభిషేక్ సెల్ ఫోన్ డాటా ను విశ్లేషించే ప‌నిలో పోలీసులున్నారు.

క‌స్టడీ పిటీష‌న్…..

మ‌రోవైపు ఈ కేసు న‌మోదై వారం రోజులైంది. పైలెట్ రోహిత్ రెడ్డి,తో పాటు సోద‌రుడు నితీష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన వ్యాపారి న‌మీత్ శ‌ర్మ‌లు చంచ‌ల్ గూడ జైల్లో ఉన్నారు. వీరిని క‌స్ట‌రీలోకి తీసుకునేందుకు పోలీసులు న్యాయ ప‌రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ ముగ్గురిని క‌స్ట‌డీకి తీసుకుని విచార‌ణ‌లో మ‌రిన్ని విష‌యాల‌ను రాబ‌ట్టాల‌ని పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురిని వేర్వురుగా విచారించి మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకునేందుకు సిట్ సిద్ధం అవుతోంది. పైలెట్ ఫాం హౌస్ లో డ్ర‌గ్స్ పార్టీ జ‌రుగుతుంద‌న్న ప‌క్కా స‌మాచారంతో పోలీసులు గ‌త శ‌నివారం ఫాం హౌస్ పై దాడులు నిర్వ‌హించారు. స్విమ్మింగ్ పూల్ స‌మీపంలోనే వారంతా ప‌ట్టుబ‌డ‌డంతో డ్ర‌గ్స్ పెద్ద మొత్తంలోనే వినిగ‌యోగించి ఉంటార‌ని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు దాడులు చేయ‌డంతో డ్ర‌గ్స్ ను స్విమ్మిగ్ లో వేసి ఉంటార‌న్న అనుమానాలు పోలీసు అధికారుల‌కు రావ‌డంతో ఆ నీటిని కూడా ప‌రీక్ష‌ల‌కు పంపిన‌ట్లు తెలిసింది.

ఎటువైపు తిరుగుతుందో….

రిమాండ్ లో ఉన్న నాటి నుంచి పోలీసులు క‌స్ట‌డీలోకి తీసుకునేందుకు పిటీష‌న్లు వేశారు. విచార‌ణ కోసం ప‌ది రోజుల స‌మ‌యం ఇవ్వాల‌ని పోలీసులు కోరుతు్న్నారు. పోలీసు పిటీష‌న్ల‌పై సోమ‌వారం కోర్టు నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే పోలీసుల అదుపులో డ్ర‌గ్స్ విక్ర‌యించిన అభిషేక్ సింగ్ ఉండ‌డం…. ఈ ముగ్గురిని పోఈసులు ప్ర‌త్యేకంగా విచారిస్తే కేసు ఎలాంటి మ‌లుపులు తిరుగుతోంద‌న్న స‌స్పెన్స్ మొద‌లైంది. బేయిల్ పై ఉన్న వారిని విచారించి కొత్త విష‌యాల‌ను పోలీసులు రాబడుతూనే ఉన్నారు. 11 మంది ఈ కేసులో ప‌ట్టుబ‌డ‌గా 8 మంది బేయిల్ పై ఉన్నారు. బేయిల్ పై ఉన్న వారిలో తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ పుట్టా మ‌హేష్ కూడా ఉన్నారు.

ఈ కేసుపై సీఎం రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు……

అసెంబ్లీ స‌మావేశాల‌కు ముందు కేసు న‌మోదు కావడంతో అసెంబ్లీ కి ఈ కేసు హీట్ త‌గిలింది. కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేత‌లు కేసుపై రాజ‌కీంగా విమ‌ర్శ‌లు చేసుకున్నారు. అసెంబ్లీలో డ్ర‌గ్స్ టెస్టుల చేయాల‌న్న స‌వాళ్ల దాకా ప‌రిస్తితులు వెళ్లాయి. ఈ స‌మావేశాల్లో దీనిపై కూడా చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంది.

పోలీసు క‌స్ట‌డీతో మ‌రిన్ని విష‌యాలు……

ఫాం హౌస్ లో జ‌రిగిన అక్ర‌మ కార్య‌క‌లాపాల‌పై ఇప్ప‌టికే పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీసిన‌ట్లు తెలిసింది. గ‌త కొన్ని రోజుల‌గా వ‌రుస‌గా జ‌రిగిన పార్టీల ద్వారా డ్ర‌గ్స్ వినియోగం జ‌రిగింద‌ని పోలీసులు త‌మ విచార‌ణ‌లో తేల్చిన‌ట్లు స‌మాచారం. అక్ర‌మ‌కార్య‌క‌లాపాల‌కు వేదిక‌గా మారిన ఫాం హౌస్ ను పోలీసులు సీజ్ చేశారు. వారం క్రితం దాడులు జ‌రిగిన స‌మ‌యంలో అక్క‌డ ఉన్న వాహ‌నాల‌న్నింటీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న‌ట్లు స తెలుస్తోంది. పోలీసులు రోహిత్ బ్ర‌ద‌ర్స్ ను క‌స్ట‌డీలోకి విచార‌ణ జ‌రిపితే… మ‌రోసారి సీన్ రిక‌న్స‌స్ట్ర‌క్ష‌న్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *