
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి హై కోర్టును ఆశ్రయించారు. దానం పార్టీ మారలేదన్న స్పీకర్ తీర్పును క్వాష్ చేయాలని మహేశ్వర్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. బీఆర్ ఎస్ పార్టీ నుంచి విజయం సాధించిన దానం నాగేందర్ ఏప్రిల్ 23వ తేదీన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నామనేషన్ ను దాఖలు చేశారని అప్పటి నుంచే దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటించాలని పిటీషన్లో కోరారు. ఎమ్మెల్యేగా అప్పటి నుంచి తీసుకుంటున్న జీత భత్యాలను వెనక్కి తీసుకోవాలని విజ్ఙప్తి చేశారు. ఏలేటి పిటీషన్ పై సోమవారం హై కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.










Leave a Reply