(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఆరు గ్యారంటీ ల పేర్లు చెప్పి అడ్డగోలుగా ఓట్లు వేయించుకొని రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వం పైన వత్తిడి తేవడానికి ఈ ప్రవేట్ మెంబర్ బిల్లు ప్రవేశ పెట్టాలని బీఆర్ ఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు పరిణామాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కీలక నేతలతో సమావేశం అయ్యారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 800 రోజులైనా ఆరు గ్యారెంటీల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచాలన్న ఉద్దేశ్యంతోనే ఈ బిల్లు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నట్లు కేటిఆర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మూడో బడ్జెట్ అని, మరొక్క బడ్జెట్ మాత్రమే ప్రవేశ పెట్టే అవకాశం ఉందని కేటిఆర్ అన్నారు. మేము ప్రవేశ పెట్టబోయే బిల్లును అనుమతించాలని స్పీకర్, మండలి చైర్మన్ లను కలిసి కోరుతామన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్త శుద్ధి ఉంటే ఈ ప్రైవేటు మెంబర్ బిల్లును సభలో ప్రవేశ పెట్టేందుకు అనుమతించాలన్నారు. శుక్రవారం రోజు ఉభయ సభల్లో అనుమతించాలని తాము ఈ బిల్లు ప్రవేశ పెడుతున్నట్లు కేటిఆర్ వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ సీఎం గా ఉన్న సమయంలో బీజేపీనేత విద్యాసాగర్ రావ్ ప్రవేశ పెట్టిన బిల్లును ఆమోదించి చట్టం తెచ్చిన విషయాన్ని కేటిఆర్ గుర్తు చేశారు. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని సభ్యులందరినీ తాము కోరుతామని కేటిఆర్ వెల్లడించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు పై సీఎం కీలక వ్యాఖ్యలు……

అభయ హస్తం లో భాగంగా ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుంది…ఆ హామీలను అమలు చేయాలని మేము బిల్లు తెస్తున్నాం….ఇంకా అభ్యంతరం ఎక్కడ ఉంటుందని కేటిఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలని మెము కోరుతున్నామని అందుకే ప్రైవేటు బిల్లు గురించి తాము నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత దక్కితే ప్రజలకు పెద్ద ప్రయోజనం దక్కినట్లవుతుందన్నారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందన్నారు. మేము ప్రవేశ పెట్టబోయే బిల్లు చట్టం అయితే…. రైతు బంధు ఎగ్గొట్టేందుకు వీలుండదని కేటిఆర్ చెప్పారు.










Leave a Reply