-హై కోర్టు బ్రేకులు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణాలో ఓ కలెక్టర్ చిరు వ్యాపారులపై వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. కలెక్టర్ తన అధికారాలను చిరు మహిళా వ్యాపారులపై చూపిస్తుండడం హాట్ హాట్ గా మారుతోంది. చివరికి ఇది కోర్టు దాకా వెళ్లడంతో….కలెక్టర్ పవర్స్ కు బ్రేకులు వేసేలా కోర్టు ఆదేశాలు వచ్చాయి. అయినా సరే…ఎలాగైన తనతో పెట్టుకుంటారా అన్న చందంగా ఆ కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయంశంగా మారుతోంది.

ఇంతకీ ఆ కలెక్టర్ కథ కమామిషూ ఏమిటో తెలుసుకోవాలనుందా…ఈ వివరాలు చూడండి…… జనగామ కలెక్టరేట్ సమీపంలో టీ స్టాల్, మిల్క్ పార్లర్లను పేద మహిళలు జీవనాధారం కోసం మొదలు పెట్టారు. ఈ వ్యాపారంపై నే ఆ రెండు కుటుంబాలు ఆధార పడి జీవనం సాగిస్తున్నాయి. పాలమాకులు చిన్న మంజుల, పోత్కనూరి విజయలక్ష్మిలు ఆ దుకాణాల యజమానులు. ఓ రోజు సడన్ గా కలెక్టర్ ను సందీప్ కుమార్ ఝూ నుంచి ఆ దుకాణాలు తొలగించాలని ఆదేశాలు అందాయి. కలెక్టర్ వ్యక్తి గతంగా ఆ నిర్ణయం తీసుకున్నారా…రాజకీయ ప్రభావితంతో ఆ నిర్ణయం తీసుకున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఖచ్చితంగా ఆ దుకాణాలను తీసివేయాలని కలెక్టర్ తన విశేష అదికారులను ఆ చిరు వ్యాపారులపై ప్రయోగించడం మొదలు పెట్టారు. తమ దుకాణాలు తొలగించవద్దని ఆ మహిళలు కలెక్టర్ ను వేడుకున్న ఆయన కనికరించలేదు. తొలగించాల్సిందే అంటూ అంతే కఠినంగా తన నిర్ణయాన్ని అమలు చేయాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. దీంతో ప్రత్యామ్నాయం కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు ఆ దుకాణాలు నిర్వహించే మహిళలు. వీరి ఫిర్యాదును విచారణకు స్వీకరించిన కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. కోర్టు స్టేటస్ కోతో ఇక వారిని విడిచి పెట్టేదే లేదన్న కక్ష్యతో చిర వ్యాపారులపై కొత్త రకం వేధింపులు అధికారుల నుంచి మొదలు పెట్టించారు. సాంకేతికంగా కోర్టు ఆదేశాలతో ఆ దుకాణాలు తొలగించే పరిస్థితి లేకపోవడంతో తన అధికారాలను అడ్డుపెట్టుకుని కనీసం మూసి వేయించలేక పోతాన్న అన్న ధీమాతో తన అధికారాలను పేదల పై ప్రయోగించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఆ చిరు దుకాణాలపై దాడులు చేయించారు.

కలెక్టర్ ఆదేశాలు ఫుడ్ సేఫ్టీ అధికారులు ధిక్కరించలేక… ఆ మహిళలు నిర్వహించే వ్యాపారాలను క్షుణ్ణంగా పరిశీలించి ఉన్నతాధికారి ఆదేశాలను అమలు చేసే ప్రయత్నం చేశారు. ఆ మహిళలతో సంతకాలు చేయించుకుని వేధింపులకు గురి చేస్తున్నారని ఆ మహిళా వ్యాపారులు వాపోయారు. చివరుకు కోర్టు ఆదేశాలతో కలెక్టర్ కూల్చి వేత ఆదేశాలను అడ్డుకున్నా…. భవిష్యత్తులో కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ వ్యవహరించిన తీరు వివాదాస్పదం కావడం…. హై కోర్టులో బాధితులకు ఊరట దక్కడంతో… ఆ వ్యాపారాలు పునః ప్రారంభం అవుతున్నాయి. ఈ విషయం కూడా నెట్టింట వైరల్ గా మారింది. హై కోర్టు ఆదేశాలతో తాత్కాలికంగా ఉపశమనం దక్కినా…అవకాశం వస్తే ఈ కలెక్టర్ ఖచ్చితంగా ఆ దుకాణాలను కూల్చి వేయిస్తారన్న చర్చ జరుగుతోంది.
కలెక్టర్ బదిలీతో అక్కడ సంబరాలు….
అయితే ఈ చిరు వ్యాపారాలు నిర్వహించే మహిళలు కూడా ప్రభుత్వ పథకమైన ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా గత కలెక్టర్ మంజూరు చేసిన వ్యాపారాలు ఈ దళిత మహిళలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత కలెక్టర్ వేధింపులు భరించలేక ఈ దళిత మహిళలు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లపై ఎస్సీ, ఎస్టీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మరో వైపు తమ వ్యాపారాలను కాపడుకునేందుకు హై కోర్టును ఆశ్రయించి తాత్కాలికంగా ఉపశమనం దక్కించుకున్నారు.

ప్రజా సేవ కోసం అధికారాలను ఉపయోగించాల్సిన అధికారులు, పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా తమ విశేష అధికారాలను ప్రయోగించడం ఎంత వరకు సమంజసం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ దుకాణాలు అక్రమమా, సక్రమమా అన్న దానిపై ఇక్కడ చర్చ లేకపోయినా…కలెక్టర్ చిరు వ్యాపారులపై తన ప్రతాపాన్ని చూపడం ఎంత వరకు సమర్ధనీయం అన్న దానిపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఒక ఉన్నతాధికారిగా తనకున్న అధికారాలతో వారిని ఒప్పించి, ప్రత్యామ్నాయం చూపించి సామరస్యాంగా పరిష్కరించే అవకాశం కూడా అధికారికి ఉంటుంది. కానీ తన విశేష అధికారాలను చిరు వ్యాపారులపై చూపిస్తున్న కలెక్టర్ ఝూ వ్యవహారం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. అయితే ఈ వ్యవహారంపై ప్రభుత్వం కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే పొరుగు ఉన్న మహబూబ్ బాద్ కలెక్టర్ బదిలీ అయితే స్థానికులు సంబరాలు చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజా సేవల ప్రజలకు చేరువ కావడం… వారి సమస్యలను పరిష్కరించడం దిశగా ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో వివిధ జిల్లాల్లో పనిచేసిన సందీప్ కుమార్ ఝా ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు. తాజాగా జనగామలో కూడా అదే విధానాన్ని అవలంభిస్తున్నారు. అయితే ఇలాంటి అధికారుల వ్యవహారం ప్రభుత్వానికి కూడా కొత్త చిక్కులు పెట్టే అవకాశం ఉంటుంది.










Leave a Reply