- సీఎం రేవంత్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రైతుల కళ్లలో ఆనందం కోసం రైతు భరోసా పథకంలో బాగంగా నిధులు విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 45 రోజుల్లో మూడు విడత్లోల 9 వేల కోట్ల రుపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. పదేళ్లలో రైతుల కోసం ప్రతి నెల 2553 కోట్ల రుపాయాలు మాత్రమే ఖర్చు చేసిందని, తామ ప్రభుత్వం సగటున ప్రతి నెల రైతుల ఖాతాల్లో రూ. 5500 కోట్లు జమ చేసిందన్నారు.
ప్రజా ప్రభుత్వంలో రైతు సంక్షేమం కోసం రెండేళ్లలో లక్ష కోట్లకుపైగా ఖర్చు చేశామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

నర్మేట్టలో పామ్ అయిల్ కంపెనీని సీఎం ప్రారంభించి అనంతరం ప్రసంగించారు. రైతులు వరి మాత్రమే సాగు చేయకుండా అన్ని రకాల పంటలు సాగు చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా వారికి ప్రోత్సాహం దక్కాలన్నారు. వరి సాగు చేస్తే కేంద్రం 50 లక్షల మెట్రిక్ టన్నులకు మించి కొనడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం 71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. తాను ప్రాతినిథ్యం వహించే కోడంగల్ నియోజకవర్గంలో కూడా అయిల్ పామ్ నిర్మించాలని తాను వ్యవసాయ శాక మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్ ను కోరుగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అంకాపూర్ రైతులు స్పూర్తి కావాలని సూచించారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎరువుల కొరత రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.

విద్యకు అత్యంత ప్రాధాన్యం…..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళణ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో విద్యా విధానాన్ని పటిష్టం చేసి నాణ్యమైన విద్యను అందించడం తమ ముందున్న ప్రాధాన్యత విషయమన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని ఎన్నికల తరువాత అభివృద్ధి తన దృష్టి అని సీఎం రేవంత్ చెప్పారు.
సిద్దిపేటకు మంత్రి పదవి…

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు మూడేళ్ల సమయం ఉన్నా…వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిని గెలిపిస్తే తాను మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఒక్కరికే అవకాశం ఒకే కుటుంబానికి దక్కుతుందన్నారు. సిద్దిపేట ప్రజలు మరో వ్యక్తిని ఆశీర్వదిస్తే… మార్పు ఎలా ఉంటుందో చూడాలన్నారు. సిద్దిపేట పై వివక్ష చూపమని 119 నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటన్నారు.











Leave a Reply