-సీఎం రేవంత్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా రాష్ట్ర పునర్నిర్మానంలో, దేశ అభివృద్ధిలో ఆర్యవైశ్యులది కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణా ఆర్యవైశ్య కార్పోరేషన్ ఆద్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న శ్రీ వాసవి మహాశక్తి మహేత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. గ్రామానికి ఒక్క ఆర్యవేశ్య కుటుంబం ఉన్నా వారు ఆ గ్రామంలో ఆధిపత్యం చూపిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని ఆరు మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు ఒక మేయర్ పదవి ఇచ్చి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించిందని చెప్పారు.

రాజరికంలో అధికార మార్పిడి కోసం హింస జరిగేదని, మహాత్మ గాంధీ కారణంగా అంహిసతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. రాజకీయంగా అవకాశాలు వచ్చినా రాకపోయినా….క్రమశిక్షణ ఉల్లంఘించకుండా ఎంతో ఓపికతో వారు రాజకీయాలు చేస్తారని రేవంత్ వ్యాఖ్యానించారు. తనకు మాజీ సీఎం రోషయ్య ఇష్టమైన నాయకుడని, ఆయనతో వాదించినా, ప్రశ్నించినా ఎంతో గౌరవంగా ఉండేదని రోషయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తామని, మీ ఆలోచన విధానంమే ప్రభుత్వ విధానమని సీఎం అన్నారు.









Leave a Reply