NewsInn

News in a Click

ప‌శ్చిమ బంగాల్ ఎన్నిక‌ల్లో ఎంఐఎం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే ప‌శ్చిమ‌ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేయ‌నుంద‌ని పార్టీ అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ వెల్ల‌డించారు. స్థానిక నేత హుమాయున్ క‌బీఆర్ ఏర్పాటు చేసిన‌ (AAM JANATA UNNAYAN PARTY) తో మిత్ర ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తూ పోటీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఎంఐఎం పార్టీని బ‌లోపేతం చేసే చ‌ర్య‌ల్లో భాగంగా తాము ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. మూడు సార్లు మ‌మ‌తా బెనర్జీ ముఖ్య‌మంత్రిగా
తీవ్ర అన్యాయం చేసింద‌న్నారు. 30 శాతం ఉన్న ముస్లింలు ఉన్నార‌ని, వీరిలో 5 ల‌క్ష‌ల మంది బీసీ స‌ర్టిఫికెట్లు ర‌ద్దు చేస్తే… అందులో మెజార్టీ ముస్లింల‌వి మాత్ర‌మే ఉన్నాయ‌న్నారు. సెక్యుల‌ర్ పేరుతో ఎన్నిక‌ల్లో గెలిచే పార్టీ అ త‌రువాత అన్యాయం చేస్తాయన్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో మాల్దాలో 7 వేల ఓట్ల ద‌క్కించుకుంద‌న్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌లు స్థానాల్లో పోటీ చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా క‌బీర్ పార్టీతో చ‌ర్చించి పోటీ చేసే స్థానాల‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *