NewsInn

News in a Click

ఫీజు రీఎంబ‌ర్స్ మెంట్ నిధులు విడుద‌ల చేయాలి

బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల నిరసన

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఫీజు రీఎంబ‌ర్స్ మెంట్ నిధుల‌ను ప్ర‌భుత్వం వెంట‌నే చెల్లించాల‌ని డిమాండ్ చేస్తూ…. బీఆర్ ఎస్ నిర‌స‌న తెలిపింది. గ‌న్ పార్క్ ద‌గ్గ‌ర నిర‌స‌న చేసిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు ఆందోళ‌న చేశారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో చెల‌గాటం ఆడుతున్న‌ట్లే విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతోంద‌ని శాస‌న‌మండ‌లిలో విప‌క్ష నేత మ‌ధుసూధ‌నాచారి ఆరోపించారు. ఫీజు రీఎంబ‌ర్స్ మెంట్ స‌కాలంలో రాక అనేక విద్యార్థులు చ‌ద‌వుకు దూరం అవుతున్నార‌ని ఆరోపించారు. 12 వేల కోట్ల రుపాయాల ఫీజు ఎంబ‌ర్స్ మెంట్ బ‌కాయిలు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ప‌ట్ల ఈ ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి లేద‌ని ఆరోపించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ ప‌థ‌కాన్ని కేసిఆర్ కొనసాగించారని చెప్పారు.
ఇప్పటికైన సకాలంలో ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చెయాల‌ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *