
- హౌస్ కమిటీకి బీఆర్ ఎస్ డిమాండ్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కుంభకోణాలకు కేంద్రంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావ్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలు నుంచి బియ్య ఎగుమతల వరకు కుంభకోణాలకు పాల్పడుతోందన్నారు. బియ్యం ఎగుమతుల కోసం ఓ సలహాదారును ప్రభుత్వం నియమించుకుందని, ఆ సలహాదారుపై ఇప్పటికే సీఐడీ, ఈడీ కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని హరీష్ రావ్ వెల్లడించారు. ఈ సలహదారు ఇచ్చిన సలహాతో రాష్ట్రానికి నష్టం జరుగలేదా అని ప్రశ్నించారు. 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఫిలిపైన్స్ కు ఎగుమతి చెస్తామని ఎంఓయు చేసుకున్నట్లు చెప్పారని, ఇది పెద్ద కుంభకోణంగా మారిందని హరీష్ రావ్ ఆరోపించారు.10లక్షల టన్నుల ఎగుమతికి ఎంఓయూ చేసుకున్న మీరు, 22,750 టన్నుల దగ్గరే ఎందుకు ఆగిపోయాయన్నారు. మరో 7,500 టన్నులు ఏడాది నుంచి కాకినాడ పోర్టులో పురుగులు పడి ముక్కిపోయి ఉన్న మాట వాస్తవమా? కాదా అన్నారు. ఎగుమతులు ఎందుకు ఆగిపోయాయని హరీష్ రావు ప్రశ్నించారు. కుంభకోణం తరువాత అడ్వయిజర్ అడ్రస్ లేకుండా పోయారని విమర్వించారు. పౌరసరఫరాల శాఖలో జరుగుతున్న కుంభకోణాలపై శాసనసభ సభ్యులతో కమిటీ వేస్తే కుంభకోణాలను నిరూపించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
బియ్యం ఎగుమతులు,కుంభకోణం, ఎగుమతులు, పౌరసరఫరాల శాఖలో కుంభకోణాలే, బీఆర్ఎస్, హరీష్ రావ్,
RICE EXPORT, RICE SCAM, EXPORTS SCAM, CIVIL SUPPLY SCAM, BRS ALLIGATIONS, HARISH RAO,







Leave a Reply