(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్ డ్రగ్ కేసు లో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. దాదాపు 10 రోజుల క్రితం ఈ కేసు నమోదు కాగా అప్పటి నుంచి నిందితులను కస్టడీకి ఇవ్వమని పోలీసులు కోరుతున్నారు. సోమవారం రోజు కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో మంగళవారం ఉందయం రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి,నమీత్ శర్మలను కస్టడీలోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసును ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తుండడంతో ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక్కొక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఫాం హౌస్ లో లభ్యమైన డ్రగ్స్ సిమ్లా నుంచి తెచ్చామని ముందుగా నిందితులు బుకాయించినా….ఆతరువాతి విచారణలో హైదరాబాద్ లోనే డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ డ్రగ్స్ విక్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు విషయాలను రాబట్టారు.

ఈ కేసులోనే మరో 8 మంది బేయిల్ పై ఉన్నారు. వీరిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కూడా ఈ కేసులో స్టేషన్ బేయిల్ దక్కడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే కేసు విచారణ కోసం నియమించిన సిట్ వీరిని దఫా దఫాలుగా విచారిస్తోంది. వీరి నుంచి పూర్తి సమాచారాన్ని రాబడుతోంది. ప్రధానంగా పైలెట్ డ్రైవర్, పీఏలను విచారిస్తోంది. వీరి నుంచి డ్రగ్స్ కొనుగోలు, మాదకద్రవ్యాల వ్యాపారులతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్ ను కట్టడి చేయాలంటే కఠినంగానే వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. ఈ ముగ్గురి పోలీస్ కస్టడీతో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. పోలీసులు ఫాం హౌస్ లో తనిఖీలకు వెళ్లిన సమయంలో నమీత్ శర్మ కాల్పులు జరుపడంతో ఈ కేసు తీవ్ర వివాదాస్పదంగా మారింది. పోలీసులు కూడా దీన్ని సీరియస్ గా పరిగణిస్తున్నారు.
పుట్టా, పైలెట్ లు ఎలా పట్టు బడ్డారు……

రాజకీయ ప్రముఖులతో ముడిపడి ఉన్న ఇలాంటి కేసులో కఠినంగా వ్యవహరిస్తే.. అందరిలోనూ భయం ఉంటుందన్న అభిప్రాయంతో పోలీసు అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.మరోవైపు ఇదే కేసులో ప్రమేయం ఉన్న ఎంపీ పుట్టా మహేష్ కు బేయిల్ దక్కడంపై ఎన్నో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.







Leave a Reply