- అన్ని పార్టీల్లో పెద్దలకు అవే తలనొప్పులు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు రాష్ట్రంలో ఇప్పుడు అందరిదృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ జిల్లాకు చెందిన మూడు ప్రధాన పార్టీల నేతలు వ్యవహరిస్తున్న తీరు ఆయా పార్టీలకు తలనొప్పిగా మారుతోంది. కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపి పార్టీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా ఈవ్యవహారం రాజకీయంగా హాట్ హాట్ మారింది. ముగ్గురు నేతలు కూడా ప్రజా జీవింతంలో అనుసరిస్తున్న వ్యూహాలు ఆయా పార్టీల్లో వివాదాలకు దారి తీస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో కలకం రేపుతోంది.
కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి……

అధికార పార్టీలో కొనసాగుతున్న జీవన్ రెడ్డి స్థానికంగా నెలకొన్ని పరస్థితులతో ఇక పార్టీలో కొనసాగలేనని ప్రకటించారు. ఇతర పార్టీల్లో నుంచి వచ్చిన నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తూ….తనకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఈ కారణంగా రాజకీయంగా రాబోయే రోజుల్లో ఉనికి కోల్పోయే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు ఈ నెల25 వ తేదీన కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తదుపరి భవిష్యత్తును ప్రకటిస్తానని వెల్లడించారు.
ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీ మార రాదంటూ చర్చలు జరుపుతున్నారు. తొలి విడతగా మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ లు వెళ్లినా….జీవన్ రెడ్డి తన నిర్ణయంలో మార్పు లేదని తేల్చి చెప్పారు. తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా జగిత్యాల వెళ్లి జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
బీఆర్ ఎస్ లో కౌషిక్ రెడ్డి……

ఇక బీఆర్ ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేతో ఆ పార్టీ పెద్దలకు తలనొప్పులు మొదలయ్యాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు స్థానిన బీఆర్ఎ స్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కింది స్థాయి నేతలంతా ఒక్కటౌతున్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం కౌషిక్ వ్యవహరిస్తున్న తీరును నేతలు తప్పు బడుతున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కీలక సమావేశాన్ని నేతలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం గురించి తెలుసుకున్న కౌషిక్ రెడ్డి ఆ సమావేశానికి వెళ్లి అసమ్మతి నేతలకు చెక్ పెట్టాలని పావులు కదిపారు. హుటాహుటిన పార్టీ అసమ్మతి నేతల సమావేశానికి హైదరాబాద్ నుంచి తరలి వెళ్లినా…. స్తానిక నేతల నుంచి వ్యతిరేకత, హెచ్చరికలతో తిరిగి హైదరాబాద్ చేరుకోవాల్సి వచ్చింది. కౌషిక్ రెడ్డి వ్యక్తి గత ఎజెండా తో వెళ్లడాన్ని నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ పెద్దలు ఈ వ్యవహారంపై దృష్టి సారించి పరిస్థితులు సరిదిద్దకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది.
బీజేపీలో ఈటల రాజేందర్……..

బీజేపీ నుంచి ఎంపీగా మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఎమ్మెల్యేగా ఓటమి అనంరతం మల్కాజిగిరిలో ఎంపీగా విజయం సాధించారు. నిన్న మొన్నటి ఇవరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేస్ లో ఆయన పేరు వినిపించింది. కానీ అనూహ్యంగా ఎంపీ తీరుపై బీజేపీ కీలక నేతల అనుమానాలు వ్యక్తం చేయడంతో…. ఆ పదవి దక్కకుండా పోయింది. అప్పటి నుంచి అవకాశం వస్తే చాలు బీజేపీ సీనియర్ నేతలను టార్గెట్ చేస్తుండడం వివాదాస్పదంగా మారుతోంది. రాష్ట్ర బీజేపీ నేతల్లో ఎవరి వర్గం వారిదే అన్నచందంగా ఉన్నా…. ఆ నేతలు బహిరంగంగా ఎక్కడా విమర్శలు చేసుకోవడం లేదు. కానీ ఈటల రాజేందర్ తన రాజకీయ అనుభవంతో పార్టీని ఇరుకున పెడుతున్నారన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా పార్టీకి దూరంగానే ఉంటున్న ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. తాము ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల్లో తమకే టికెట్లు ఇచ్చే అవకాశం ఉండాలని డిమాండ్ మొదలు పెట్టారు.బీజేపీలో ఇంతకు ముందు ఈ పరిస్థితి ఎప్పుడూ లేకపోవడంతో ఈటల చేసిన డిమాండ్ పార్టీ లో క్రమశిక్షణపై మరోసారి చర్చ మొదలైంది.
జీవన్ రెడ్డి తో చర్చలు…
మొత్తం మీద కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ ముగ్గురు నేతల తీరు…ఆయా పార్టీల్లో పెద్దలకు తలనొప్పులకు బీజం వేస్తోంది. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పార్టీ వీడడం ఖాయమైంది. కానీ ఈ కౌషిక్ రెడ్డి, ఈటల రాజేందర్ లు ఆయా పార్టీల్లోనే కొనసాగుతారా అసంతృప్తితో కొత్త దారులను వెతుక్కుంటారా అన్నది ఆసక్తి రేపుతున్న్న అంశంగా మారింది. అయితే ఈటల రాజేందర్ విషయంలో ఎన్నో అనుమానాలు అటు పార్టీ నేతలను ఇటు పార్టీ క్యాడర్ ను వెంటాడుతున్నాయి.






Leave a Reply