
(అమరావతి,న్యూస్ఇన్)
విజయవాడలో అనుమానాస్పద ఉగ్రవాద సంబంధాల విషయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి మద్దతు తెలిపిన ముగ్గురు యువకులు—మొహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మిర్జా సోహైల్ బేగ్, మొహమ్మద్ డానిష్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం వారిని విచారిస్తున్న అధికారులు, పాకిస్తాన్లో ఉన్న హ్యాండ్లర్లతో వీరికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వన్టౌన్ ప్రాంతంలోని ఒక మసీదులో వీరు పరిచయం అయినట్లు తెలిసింది. వివిధ ప్రాంతాల్లో యువతను ప్రేరేపించి ఉగ్రవాద దిశగా మళ్లించే ప్రయత్నాలు చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.







Leave a Reply