
(హైదరాబాద్,న్యూస్ఇన్)
నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయం కూడా వేడెక్కేలా కనిపిస్తోంది. 50 శాతం సీట్ల పెంపు ఉంటుందని కేంద్రం సంకేతాలు ఇవ్వడంపై తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.కేంద్రం ఏ ప్రాతిపదికన పార్లమెంట్ స్థానాలు పెంచుతుందని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో ఏ స్థాయిలో అంతరం ఉందో అదే స్థాయిలో సీట్ల పెంపు ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు భారీగా పెరిగితే బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలతో అవసరం ఉండన్నారు. తద్వారా కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాల నేతలకు ప్రాతినిథ్యం లేకుండా పోతుందన్నారు. ఉత్తర భారత దేశానికి, దక్షిణ భారత దేశానికి ఈప్రభుత్వం అంంతరాన్ని పెంచుతోందని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఇది ప్రజల్లోకి తీసుకెళ్తామని సీఎం అన్నారు.





Leave a Reply