
- ఎన్ రాంచందర్ రావ్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
జనాభా లెక్కల అనంతరం నియోజకవర్గాల పునర్విభజన జరుగడం రాజ్యంగ ప్రక్రియ అని దీని పై లేని పోని అపోహలు సృష్టిస్తూ ప్రజలను ప్రతిపక్ష పార్టీలు తప్పుదోవ పట్టించవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావ్ అన్నారు. డీలిమిటేషన్ పూర్తిగా జనాభా ఆధారంగా మాత్రమే జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పుదారి పట్టించేదిగా ఉంది. ఒకవేళ కేవలం జనాభా ఆధారంగా చేస్తే దక్షిణ రాష్ట్రాల్లో చాలా తక్కువ సీట్లు రావాల్సి ఉంటుంది. అక్కడ ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ సీట్ల సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంది.హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కూడా జనాభా తక్కువగా ఉన్నప్పటికీ అసెంబ్లీ సీట్లు అధికంగా ఉన్నాయి. కాబట్టి కేవలం జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరుగుతుందనడం పూర్తిగా తప్పు.ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లను ఆధారంగా తీసుకుని ప్రపోర్షనేట్గా సీట్ల పెంపు జరుగుతుందన్నారు.
డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణ రాష్ట్రాల సీట్లు తగ్గే పరిస్థితి లేదు. న్యాయంగా, సమానంగా అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం పెరుగుతుంది.
రాబోయే 2026 జనగణన అనంతరం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, ప్రస్తుతం ఉన్న సీట్ల ప్రాతిపదికన ప్రపోర్షనేట్గా పునర్విభజన జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మకూడదు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే రాజకీయాలను మానుకోవాలని సూచించారు.
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తాం……
ఇక ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది. మతం మారిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ హక్కులను వినియోగిస్తున్న పరిస్థితిపై సుప్రీంకోర్టు స్పష్టమైన నిర్ణయం తీసుకుంది.మతం మారిన వారికి ఎస్సీ, ఎస్టీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును భారతీయ జనతా పార్టీ ఘనంగా స్వాగతిస్తోంది. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల హక్కుల విషయంలో మతం మారిన వారు ఆ హోదాను కోల్పోతారని స్పష్టం చేసింది.ఈ తీర్పుతో సి మత మార్పిడులకు ప్రోత్సహించే కార్యకలాపాలకు చెక్ పడింది. మతం మారిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన హక్కులను దుర్వినియోగం చేస్తున్న పరిస్థితికి ముగింపు పలికినట్టైంది.




Leave a Reply