(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయంశంగా మారుతోంది. సోషల్ మీడియాలో మాధవి లతకు అనుకూలంగా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన ఆమె ఢిల్లీ ఏయిర్ పోర్టులో ప్రేయర్ రూంలోకి వెళ్లి దుర్గా స్థుతిని జపించారు. దాదాపు రెండు నిమిషాల నిడివి గల వీడియో ఆమె తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. అదే రూంలో కొంత మంది మైనార్టీ మహిళలు కూడా ఉన్నారు. ఒక వైపు వారు ప్రార్థనాలు చేస్తుండడం, మరో వైపు దుర్గా స్థుతిని ఆ గదిలోకి వెళ్లి మాధవి లతా పూర్తి చేసుకుని రావడం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది.
మైనార్టీ వర్గానికి చెందిన నేతలు మాధవి లత వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. హైదరాబాద్ కు చెందిన కొంత మంది ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్లే విధంగానే మాధవి లత వ్యవహరించారని వారు ఆరో పిస్తున్నారు. మైనార్టీ వర్గ చెందిన వారు ఈ అంశాన్ని తప్పుబడుతున్నారు. సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. సనాతన ధర్మం కాపాడాలంటే హిందువులు ప్రార్థనలు చేస్తే తప్పేమిటని కొంత మంది మాధవి లతకు మద్దతుగానిలుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మాధవి లతా మరోసారి స్పందించారు.
భక్తి ఒక జీవన విధానం……
ఆమె ఎక్స్ లో తాజాగా వివరణ ఇచ్చారు.హిందూ ధర్మం మనకు సూర్యోదయం, మధ్యాహ్నం, సూర్యాస్తమయ సమయాలలో, సంధ్యాకాలంలో మరియు ఆ తర్వాత కూడా దైవాన్ని ఎల్లప్పుడూ స్మరించమని బోధిస్తుందన్నారు.
భక్తి అనేది ఒక క్షణికమైనది కాదు,అది ఒక జీవన విధానం. వైదిక ధర్మం నుండి పంచమహాయజ్ఞాల స్ఫూర్తి వరకు, ప్రతి కర్మ ఒక అర్పణగా మారుతుంది.భగవద్గీత (8.7) మనకు ఇలా గుర్తుచేస్తుంది: “నన్ను ఎల్లప్పుడూ స్మరించండి.జపం, స్తోత్రం లేదా మౌన ప్రార్థన ద్వారా, ఈ నిరంతర స్మరణ మనల్ని ధర్మంతో అనుసంధానం చేస్తుంది.హిందూ సంప్రదాయంలో, ప్రార్థన అంటే దైవంతో మాట్లాడటం, ధ్యానం అంటే వినడం. రెండూ అత్యవసరం.అటువంటి భక్తిని ప్రశ్నించడం అంటే సనాతన ధర్మం యొక్క సార్వత్రిక మరియు విస్తృత స్వభావాన్ని అపార్థం చేసుకోవడమే.




Leave a Reply