NewsInn

News in a Click

ప్ర‌ధాని వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల్లో లాక్ డౌన్ ఆందోళ‌న‌

ప్ర‌ధాని వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల్లో లాక్ డౌన్ ఆందోళ‌న‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ప‌శ్చిమాసియా యుద్ధం ప్ర‌భావం ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల‌పై ప‌డుతోంది. ఇప్ప‌టికే ప‌లు దేశాలు ఆంక్ష‌లు అమ‌లు చేయ‌డం మొద‌లు పెట్టాయి. ప్ర‌ధానంగా పెట్రో ఉత్త్ప‌త్తుల‌తో ముడి ఉండ‌డంతో ఈప్ర‌భావం అన్ని రంగాల‌పై చూపుతోంది. ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ రాజ్య‌స‌భ‌లో చేసిన ప్ర‌సంగం ప్ర‌జ‌ల్లో మ‌రింత ఆందోళ‌న పెంచుతోంది. ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటున్నా….. మ‌రోసారి లాక్ డౌన్ ప‌రిస్థితుల మాదిరిగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాల‌న్న సంకేతాలతో దేశ వ్యాప్తంగా ఆందోళ‌న మొద‌లైంది. యుద్ధం మొద‌లైన నాటి నుంచి ప‌రిశీలిస్తే క్ర‌మంగా నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెరుగుతున్నాయి. వినియోగం లేక‌పోవ‌డంతో కూర‌గాయ‌ల ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. కార‌ణం హోట‌ళ్లు, హాస్ట‌ళ్ల‌కు స‌రైన స్థాయిలో గ్యాస్ సిలిండ‌ర్లు అంద‌క‌పోవ‌డ‌మే. ప‌ది రోజుల క్రిత‌మే హోట‌ల్ యజ‌మానులు టిఫిన్ల ధ‌ర‌లు పెంచారు. గ్యాస్ ఎక్కువ‌గా వినియోగించే అవ‌కాశం ఉండే వాటిని పూర్తిగా మెను లోనుంచి తొల‌గించారు.

అన్ని రంగాల‌పై ప్ర‌భావం…….

ఇరాన్- ఇజ్రాయిల్, అమెరికా మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధ ప్ర‌భావం కార‌ణంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తం అవుతున్నాయి.ఇప్ప‌టి వ‌ర‌కు పెట్రో ఉత్ప‌త్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేదు….కావాల్సినంత స్టాక్ ఉంద‌టూకేంద్రం ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ వ‌చ్చింది. అయితే ప్ర‌ధాని మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌తో కేంద్ర ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర కూడా స‌రిప‌డా నిల్వ‌లు లేక‌పోవ‌డంతో…పాటు స‌రైన స‌ర‌ఫ‌రా కూడా అంద‌డం లేద‌న్న విష‌యంపై అనుమానాలు పెరుగుతున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి త‌లెత్తుతోంది. మ‌రో కోవిడ్ లాంటి స‌మ‌యాన్ని ఎదుర్కొనేందుకు దేశ ప్ర‌జ‌లు సిద్ధంగా ఉండాల‌ని ప్ర‌దాని వ్యాఖ్య‌లు చేశారు. అంటే లాక్ డౌన్ కార‌ణంగా రోజు వారి కార్య‌క్ర‌మాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎంతో మంది వ‌ర్క్ ఫ్రం హోం చేయాల్సి వ‌చ్చింది. విద్యా సంస్థ‌లు సెల‌వుల‌ను ప్ర‌క‌టించారు. పెట్ర‌ల్,డీజిల్ ఉత్ప‌త్తుల కొర‌త ఏర్ప‌డితే ప‌ట్ట‌ణాల్లో ర‌వ‌ణా వ్య‌వ‌స్థ పూర్తిగా స్థంభించిపోయే అవ‌కాశం ఉంది.

మూత‌బ‌డుతున్న పెట్రోల్ బంక్ లు…..

న‌గ‌రంలో రెండు రోజులుగా పెట్రోల్ బంక్ లు ఒక్కొక్క‌టిగా మూత ప‌డుతున్నాయి. దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంక్ ల ద‌గ్గ‌ర పెద్ద ఎత్తున పెట్ర‌ల్, డీజీల్, సీఎన్జీ గ్యాస్ కోసం గంట‌ల త‌ర‌బ‌డి క్యూలో నిల‌బ‌డాల్సి వ‌స్తోంది. నాలుగైదు రోజుల క్రితం ఈ ప‌రిస్థితి న‌గ‌ర శివారుల్లో మొద‌లైంది. కానీ ఆ త‌రువాత న‌గ‌ర వ్యాప్తంగా విస్త‌రిస్తోంది. కీల‌క ప్రాంతాల్లో పెట్ర‌లో బంక్ ద‌గ్గ‌ర నోస్టాక్ బోర్డ‌లు వెలుస్తున్నాయి. దీంతో వాహ‌న‌దారుల తాకిడి భ‌రించ‌లేక పెట్రోల్ బంకులు మూసి వేస్తున్నారు. ఇక వాణిజ్య గాస్ కు నిన్న మొన్న‌టి వ‌ర‌కు స‌మ‌స్య‌లు మొద‌లైనా తాజాగా గృ హ వినియోగ‌దారులు కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. స‌రైన స‌మ‌యానికి గ్యాస్ అంద‌డం లేద‌ని వాపోతున్నారు. ఇదే అద‌నుగా గ్యాస్ ఏజ‌న్నీలు బ్లాక్ మార్కెట్ తో సొమ్ము చేసుకుంటున్నాయ‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. మరికొన్ని రోజులు ఇదే ప‌రిస్థితి త‌లెత్తితే అన‌ధికారిక లాక్ డౌన్ ఉంటుంద‌న్న అభిప్రాయం ప్ర‌జ‌ల్లో కూడా మొదలౌతోంది.

ప్ర‌ధాని వ్యాఖ్య‌లతో ప్ర‌భుత్వం అలెర్ట్…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *