
(హైదరాబాద్,న్యూస్ఇన్)
పశ్చిమాసియా యుద్ధంతో రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసరంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నగరంలో పెట్రోల్ కొరత మొదలు కావడంతో….. దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు సర్కార్ రెడీ అవుతోంది. ఇంధన సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంపై ఈ సమావేశంలో చర్చ జరుగనుంది. రాష్ట్రానికి సరిపడా నిల్వలు తెచ్చుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించన్నారు.
బీఆర్ ఎస్ వాయిదా తీర్మానం…
అమెరికా ఇజ్రాయెల్ -ఇరాన్ యుద్ధం నేపథ్యం లో పెట్రోల్ ,డీజిల్ ,గ్యాస్,యూరియా తదితరాల అందుబాటుపై ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనల పై శాసన సభలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తగిన కార్యాచరణ ప్రకటించాలని కోరుతూ బీ ఆర్ ఎస్ శాసన సభా పక్షం వాయిదా తీర్మానం ప్రతిపాదించింది. ప్రజల్లో నెలకొంటున్న గ్యాస్, పెట్రోల్ సరఫరా పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ చేశారు.
లాక్ డౌన్ వ్యాఖ్యలు కలకలం……



Leave a Reply