
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణాలో ప్రస్తుతం ఇంధన కొరత లేదని , ఇంధన నిల్వలు లేవన్న ప్రచారం వాస్తవం కాదని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రజలు అనవసరంగా బంకుల దగ్గర క్యూ కడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.ప్రస్తుతం HPCL, IOCL, BPCL వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయి. సరఫరా గొలుసు ఎక్కడా ఆగలేదని పేర్కొన్నారు. పెట్రోల్ లేదన్న ఆందోళనతో పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుండడంతో
సాధారణం కంటే 2.5 నుండి 3 రెట్లు విక్రయాలు పెరిగాయని అసోసియేషన్ పేర్కొంది. ఎక్కువ లీటర్ల కొనుగోలు కారణంగా తాత్కలికంగా స్టాక్ పూర్తవుతుందని, ఇది కొరత కాదన్నారు. పెట్రోల్ లేదా డీజిల్ను డబ్బాల్లో, క్యాన్లలో నింపి నిల్వ చేయడం PESO నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ప్రజలు తమకు అవసరమైనంత మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, అనవసరంగా నిల్వ చేయవద్దని అసోసియేషన్ కోరింది.
ప్రభుత్వం కీలక సమావేశం…..



Leave a Reply